విద్యార్థులు,ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రత దృష్టిలో పెట్టుకుని సిఎం 10 వ తరగతి పరీక్షలు వాయిదా వేయాలని ఆదేశించారు.
విధాత:కరోనా పరిస్థితి చక్కబడ్డాక తిరిగి పరీక్షల నిర్వహణ పై నిర్ణయం తీసుకుంటాం.త్వరలోనే పరీక్షల షెడ్యూల్ ప్రకటిస్తాం.ఉన్నత చదువులకు ఇంటర్, టెన్త్ పరీక్షలు చాలా అవసరం.విద్యార్థులు నష్ట పోకుండా పరీక్షలు నిర్వహించాలని చూస్తున్నాం.కేంద్ర ప్రభుత్వం కూడా సీబీఎస్ఈ పరీక్షల నిర్వహణకు కసరత్తు చేస్తోంది. సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించాలని కూడా మేము కోరాం.కోవిడ్ నివందనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉంది.10వ తరగతి విద్యార్థులకు ఆన్ లైన్ ద్వారా క్లాసులు ఉంటాయి.తల్లిదండ్రులు ఆందోళన పడాల్సిన అవసరం లేదు.స్వీయ నియంత్రణతో కరోనా […]

విధాత:కరోనా పరిస్థితి చక్కబడ్డాక తిరిగి పరీక్షల నిర్వహణ పై నిర్ణయం తీసుకుంటాం.త్వరలోనే పరీక్షల షెడ్యూల్ ప్రకటిస్తాం.ఉన్నత చదువులకు ఇంటర్, టెన్త్ పరీక్షలు చాలా అవసరం.విద్యార్థులు నష్ట పోకుండా పరీక్షలు నిర్వహించాలని చూస్తున్నాం.కేంద్ర ప్రభుత్వం కూడా సీబీఎస్ఈ పరీక్షల నిర్వహణకు కసరత్తు చేస్తోంది.
సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించాలని కూడా మేము కోరాం.కోవిడ్ నివందనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉంది.10వ తరగతి విద్యార్థులకు ఆన్ లైన్ ద్వారా క్లాసులు ఉంటాయి.తల్లిదండ్రులు ఆందోళన పడాల్సిన అవసరం లేదు.స్వీయ నియంత్రణతో కరోనా నుండి కాపాడుకోవచ్చు.ఉపాధ్యాయులు కూడా కరోనా కు ప్రాణాలు కోల్పోయారు.పరీక్షలు వాయిదా పడిన నేపథ్యంలో టీచర్లు కూడా స్కూల్స్ కి రావాల్సిన అవసరం లేదు
టీడీపీ మొండి వైఖరితో ముందుకు వెళుతుంది.వాస్తవాలను వాస్తవంగా చూడాల్సిన బాధ్యత ప్రతిపక్షాలకు ఉందిలోకేష్ ఏమి సాధించాలని పరీక్షలు రద్దు చేయాలని అంటున్నారు.పరీక్షలు రాయకపోతే ఏమైనా కరోనా రాదు అని గారంటీ ఉందా..?అని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు.