ఏపీలో కరోనా ఉగ్రరూపం కొనసాగుతోంది. కొత్తగా మరో 20 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24గంటల వ్యవధిలో 1,15,784 శాంపిల్స్ పరీక్షించగా.. రాష్ట్ర వ్యాప్తంగా 20,034 మందికి పాజిటివ్గా (17.3% పాజిటివిటీ) నిర్ధారణ అయినట్టు ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. అలాగే, 82 మంది మృతి చెందినట్టు చెప్పారు. వైరస్ బారిన పడి కోలుకుంటున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోందన్నారు. రాష్ట్రంలో కొత్తగా 176 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించిన […]
ఏపీలో కరోనా ఉగ్రరూపం కొనసాగుతోంది. కొత్తగా మరో 20 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24గంటల వ్యవధిలో 1,15,784 శాంపిల్స్ పరీక్షించగా.. రాష్ట్ర వ్యాప్తంగా 20,034 మందికి పాజిటివ్గా (17.3% పాజిటివిటీ) నిర్ధారణ అయినట్టు ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. అలాగే, 82 మంది మృతి చెందినట్టు చెప్పారు. వైరస్ బారిన పడి కోలుకుంటున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోందన్నారు.
రాష్ట్రంలో కొత్తగా 176 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించిన ఆయన.. ఇందుకోసం రూ.346 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. రాష్ట్రంలో ఆక్సిజన్ సౌకర్యం ఉన్న పడకలు 21,850 ఉన్నాయని తెలిపారు. రెమ్డెసివిర్ ఇంజెక్షన్ల కొరత లేదని స్పష్టంచేశారు.