విధాత: కుప్పం పురపాలక సంస్థ ఎన్నికల అధికారిగా పట్టు పరిశ్రమకు చెందిన సుబ్రమణ్యం ఉన్నప్పుడు.. ప్రత్యేక అధికారిగా మరొకరిని ఎందుకు నియమించాల్సి వచ్చిందని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని(ఎస్ఈసీ), రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఏ చట్టం ప్రకారం ఇలా చేశారో చెప్పాలంది. కుప్పంలో ఎన్నికలు నిష్పాక్షికంగా నిర్వహించేందుకు రిటర్నింగ్ అధికారి(ఆర్వో) లోకేశ్వరవర్మను బాధ్యతల నుంచి తొలగించి తక్షణం మరో ఆర్వోను నియమించేలా ఎస్ఈసీని ఆదేశించాలని కోరుతూ 20వ వార్డు తెదేపా అభ్యర్థి వి.వెంకటరమణ హైకోర్టులో వ్యాజ్యం వేశారు
విధాత: కుప్పం పురపాలక సంస్థ ఎన్నికల అధికారిగా పట్టు పరిశ్రమకు చెందిన సుబ్రమణ్యం ఉన్నప్పుడు.. ప్రత్యేక అధికారిగా మరొకరిని ఎందుకు నియమించాల్సి వచ్చిందని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని(ఎస్ఈసీ), రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఏ చట్టం ప్రకారం ఇలా చేశారో చెప్పాలంది. కుప్పంలో ఎన్నికలు నిష్పాక్షికంగా నిర్వహించేందుకు రిటర్నింగ్ అధికారి(ఆర్వో) లోకేశ్వరవర్మను బాధ్యతల నుంచి తొలగించి తక్షణం మరో ఆర్వోను నియమించేలా ఎస్ఈసీని ఆదేశించాలని కోరుతూ 20వ వార్డు తెదేపా అభ్యర్థి వి.వెంకటరమణ హైకోర్టులో వ్యాజ్యం వేశారు