దిశ చట్టం అంతా ప్రచారమే తప్ప నిజం కాదని కానిస్టేబుల్ ఈ ఘ‌ట‌న‌కి పాల్ప‌డ్డాడ‌..!

విధాత‌: ఆంధ్రప్రదేశ్ లో రోజుకో అమానవీయ ఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరం. ఏకంగా పోలీసులే అత్యాచారయత్నానికి పాల్పడితే ఇక ఆడబిడ్డల కష్టాలు,బాధలు ఎవరితో చెప్పుకోవాలి? గుంటూరు ఎటి అగ్రహారంలో బాలిక పై కానిస్టేబుల్ అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన రాష్ట్రం ఉలిక్కి పడేలా చేసింది. దిశ చట్టం అంతా ప్రచారమే తప్ప నిజం కాదని తెలిసే ఇలాంటి ఘటనకి కానిస్టేబుల్ పాల్ప‌డ్డాడా! అనే అనుమానం కలుగుతోంది. ఇంత దారుణానికి పాల్పడిన వాడికి 21 రోజుల్లో శిక్ష వెయ్యకుండా కేవలం సస్పెండ్ […]

  • Publish Date - August 21, 2021 / 06:34 AM IST

విధాత‌: ఆంధ్రప్రదేశ్ లో రోజుకో అమానవీయ ఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరం. ఏకంగా పోలీసులే అత్యాచారయత్నానికి పాల్పడితే ఇక ఆడబిడ్డల కష్టాలు,బాధలు ఎవరితో చెప్పుకోవాలి? గుంటూరు ఎటి అగ్రహారంలో బాలిక పై కానిస్టేబుల్ అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన రాష్ట్రం ఉలిక్కి పడేలా చేసింది. దిశ చట్టం అంతా ప్రచారమే తప్ప నిజం కాదని తెలిసే ఇలాంటి ఘటనకి కానిస్టేబుల్ పాల్ప‌డ్డాడా! అనే అనుమానం కలుగుతోంది. ఇంత దారుణానికి పాల్పడిన వాడికి 21 రోజుల్లో శిక్ష వెయ్యకుండా కేవలం సస్పెండ్ చేసి చేతులు దులుపుకుని, సమాజానికి జగన్ రెడ్డి గారు ఏం చెప్పాలనుకుంటున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిప‌డ్డారు