విధాత:జిల్లాలో కోవిడ్ వైద్య సేవలు అందిస్తూ, ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించని 13 ఆసుపత్రులకు రూ.56 లక్షలు జరిమానా విధించడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్(అభివృద్ధి), నోడల్ అధికారి ఎల్.శివశంకర్ ఆదివారం ఒక ప్రకటన లో తెలిపారు. కృష్ణా జిల్లా కలెక్టర్ ఏ ఎండి ఇంతియాజ్ , అదనపు ముఖ్య కార్యదర్శి (ఆరోగ్యశ్రీ ) జాయింట్ కలెక్టర్ హోదాలో తాను ఇచ్చిన ఆదేశాల మేరకు నగరం లో కోవిద్ ట్రీట్మెంట్ అందిస్తున్న హాస్పిటల్స్ పై జిల్లా కోఆర్డినేటర్ ఆరోగ్యశ్రీ […]
విధాత:జిల్లాలో కోవిడ్ వైద్య సేవలు అందిస్తూ, ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించని 13 ఆసుపత్రులకు రూ.56 లక్షలు జరిమానా విధించడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్(అభివృద్ధి), నోడల్ అధికారి ఎల్.శివశంకర్ ఆదివారం ఒక ప్రకటన లో తెలిపారు. కృష్ణా జిల్లా కలెక్టర్ ఏ ఎండి ఇంతియాజ్ , అదనపు ముఖ్య కార్యదర్శి (ఆరోగ్యశ్రీ ) జాయింట్ కలెక్టర్ హోదాలో తాను ఇచ్చిన ఆదేశాల మేరకు నగరం లో కోవిద్ ట్రీట్మెంట్ అందిస్తున్న హాస్పిటల్స్ పై జిల్లా కోఆర్డినేటర్ ఆరోగ్యశ్రీ మరియు విజిలెన్స్ సిబ్బంది ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించినట్లు జేసి ఎల్. శివశంకర్ తెలిపారు.
హాస్పిటల్స్ వారు రోగులకు అందిస్తున్న సేవలపై ఆరాతీసి, ప్రభుత్వ ఉత్తర్వులు సంఖ్య 52 ; 210 లను అతిక్రమించి , రోగుల వద్దనుండి అధికవసూళ్లుకు పాల్పడినటువంటి 11 హాస్పిటల్స్ పై మే – 15 వరకు రూ. 44 లక్షల అపరాధ రుసుము వెయ్యడం జరిగిందన్నారు. అలాగే 22 మే న చేప్పట్టిన తనిఖీల్లో స్మైల్ హాస్పిటల్, విజయవాడ పై రూ. 6 లక్షలు, EVR హెల్త్ హాస్పిటల్ పై రూ.6 లక్షలు పెనాల్టీ వేశామనిమొత్తంగా ఇప్పటివరకు రూ. 56 లక్షలు జరిమానాను విధించామన్నారు.
జిల్లా క్రమశిక్షణా కమిటీ చైర్మన్ ఎల్. శివ శంకర్ సంబంధించిన ఆసుపత్రు లపై పెనాల్టీ విధించటంతో పాటుగా కొన్ని హాస్పిటల్స్ కు కోవిద్ అనుమతులు రద్దు చేసినట్టు జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డా. వై. బాల సుబ్రహ్మణ్యం తెలిపినారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ , విజయవాడ సెంట్రల్ శాసన సభ్యులు మల్లాది విష్ణు జిల్లా అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించినట్లు ఆయన తెలిపారు.
బ్లాక్ ఫంగస్ చికిత్స నిమిత్తం జిల్లాకు అవసరమైన మందుల సరఫరా , ఫంగస్ గుర్తించే ల్యాబ్ లు, కోవిద్ వైద్య సేవలకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో 50 శాతం పడకలు ఆరోగ్యశ్రీ కింద చెప్పట్టడం అంశాలపై ఆదేశాలు జారీ చేసారన్నారు. ఆదివారం మచిలీపట్నం లోని సెంట్రల్ డ్రగ్ కేంద్రాన్ని జేసి తనిఖీ చేశారు.అక్కడ అధికారులకు, సిబ్బందికి స్టాక్ నిర్వహణపై ఆదేశాలు జారీచేశారు. తనిఖీల్లో ఆర్డీఓ ఖాజావలి పాల్గొన్నారు.