విధాత:తూ.గో.జిల్లా,రాజోలు హైస్కూల్ లో ప్లాస్టిక్ బియ్యం అంటు కలకలం.మధ్యాహ్న ఆహారపధకం నుంచి స్కూల్ పిల్లలకు 6కేజీల బియ్యం పంపిణీ చేయగా అందులో ప్లాస్టిక్ కలిసిందంటూ కలకలం రేపగా భయాందోళనలకు గురవుతున్నా పిల్లలు తల్లిదండ్రులు.దీంతో రాజోలు ఎమ్మార్వో బి.యమ్.ముక్తేశ్వరరావు వివరణ ఇస్తూ పిల్లలకు ఇచ్చిన బియ్యంలో ఏవిధమైన ప్లాస్టిక్ కలవలేదు పోషకాహారం కలిసిన పిండిపదార్థం మాత్రమే అని పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారము ఇస్తున్నామని పిల్లల తల్లిదండ్రులు ఏవిధమైన అపోహలు పడవద్దని ఎమ్మార్వో ముక్తేశ్వరరావు తెలిపారు.