Special Trains | దక్షిణ మధ్యరైల్వే శుభవార్త.. విశాఖపట్నం నుంచి చెన్నైకి ప్రత్యేక రైళ్లు..!

Special Trains | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. విశాఖపట్నం - చెన్నై మధ్య ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు వెల్లడించింది. మే 4 నుంచి జూన్‌ 26 వరకు పది ట్రిప్పులు రాకపోకలు సాగిస్తాయని తెలిపింది. విశాఖపట్నం - చెన్నై ఎగ్మోర్‌ (08577) మధ్య ప్రతి శనివారం అందుబాటులో ఉంటుంది.

  • Publish Date - April 25, 2024 / 11:24 AM IST

Special Trains | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. విశాఖపట్నం – చెన్నై మధ్య ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు వెల్లడించింది. మే 4 నుంచి జూన్‌ 26 వరకు పది ట్రిప్పులు రాకపోకలు సాగిస్తాయని తెలిపింది. విశాఖపట్నం – చెన్నై ఎగ్మోర్‌ (08577) మధ్య ప్రతి శనివారం అందుబాటులో ఉంటుంది. ఇక చెన్నై ఎగ్మోర్‌ నుంచి విశాఖపట్నం (08558) మధ్య ప్రతి ఆదివారం మే 5 నుంచి జూన్‌ 6 వరకు నడుస్తాయని తెలిపింది. ఈ రైలుతో పాటు సంత్రగాచి-బెంగళూరు, బెంగళూరు – సంత్రగాచి, తాంబరం – బరౌనీ, బరౌనీ – తాంబరం, ఈరోడ్‌ – ధన్‌బాద్‌, ధన్‌బాద్‌ – ఈరోడ్‌, తాంబరం – ధన్‌బాద్‌, ధన్‌బాద్‌ – తాంబరం మధ్య ప్రత్యేక రైళ్లు పరుగులు తీస్తాయని వివరించింది.

Latest News