Hyderabad | 22న‌ సద్దుల బతుకమ్మ.. ట్యాంక్‌బండ్‌ పరిసరాలలో ట్రాఫిక్‌ ఆంక్షలు

Hyderabad | 22న‌ సద్దుల బతుకమ్మ.. ట్యాంక్‌బండ్‌ పరిసరాలలో ట్రాఫిక్‌ ఆంక్షలు

Hyderabad | బ‌తుక‌మ్మ వేడుక‌లు ముగింపు ద‌శ‌కు చేరుకున్నాయి. ఆదివారం రోజు స‌ద్దుల బ‌తుక‌మ్మ నిర్వ‌హించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాట్లు పూర్త‌య్యాయి. రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో కూడా స‌ద్దుల బ‌తుక‌మ్మ వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించేందుకు ట్యాంక్‌బండ్‌పై ఏర్పాట్లు చేశారు. ఈ నేప‌థ్యంలో ఆదివారం మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుంచి రాత్రి 11 గంట‌ల వ‌ర‌కు ట్యాంక్‌బండ్‌తో పాటు ప‌రిస‌ర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించనున్న‌ట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్ల‌డించారు.

ట్రాఫిక్ ఆంక్ష‌లు ఇలా..

  • తెలుగుతల్లి ఫ్లై ఓవ‌ర్‌, కర్బాలా మైదాన్‌ వైపు నుంచి వచ్చే వాహనాలకు ట్యాంక్‌బండ్ మీదుగా మధ్యాహ్నాం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అనుమతి లేదు.
  • సికింద్రాబాద్‌ నుంచి ట్యాంక్‌బండ్ పైకి వచ్చే వాహనాలను కర్బాలా మైదాన్‌ వద్ద బైబిల్‌ హౌస్‌ మీదుగా తెలుగు తల్లి ఫ్లై ఓవ‌ర్‌ వైపు మళ్లిస్తారు.
  • ఎక్బాల్‌మినార్‌ నుంచి వచ్చే వాహనాలను, తెలుగు తల్లి ఫ్లై ఓవ‌ర్‌పైకి మళ్లిస్తారు.
  • పంజాగుట్ట, రాజ్‌భవన్‌ రోడ్డులో నుంచి ఖైరతాబాద్ ఫ్లై ఓవ‌ర్‌ మీదుగా వచ్చే వాహనాలను నెక్లెస్‌ రోటరీ ఇందిరాగాంధీ విగ్రహాం వద్ద ఐమాక్స్‌ రూట్‌లోకి మళ్లిస్తారు.
  • నల్లగుట్ట నుంచి బుద్దభవన్‌ వైపు అనుమతి లేదు. నల్లగుట్ట క్రాస్‌రోడ్డు వద్ద రాణిగంజ్‌, నెక్లెస్‌ రోడ్డు వైపు వాహనాలను మళ్లిస్తారు.
  • హిమాయత్‌నగర్‌, బషీర్‌బాగ్‌, అంబేద్కర్‌ విగ్రహాం వైపు నుంచి ట్యాంక్‌బండ్‌పైకి వాహ‌నాల‌ను అనుమ‌తించ‌రు. ఈ వాహనాలు ఇక్బాల్‌ మినార్‌ వైపు వెళ్లి యూ టర్న్‌ తీసుకొని తెలుగు తల్లి జంక్షన్‌, తెలుగు తల్లి ఫ్లై ఓవ‌ర్‌పై నుంచి వెళ్లాలి.
  • సికింద్రాబాద్‌ వచ్చే వాహనాలను అప్పర్ ట్యాంక్‌బండ్ పైకి అనుమతించ‌రు. ఆ వాహనాలను డీబీఆర్‌ మిల్స్‌ వద్ద కట్టమైసమ్మ ఆలయం, తెలుగు తల్లి ఫ్లై ఓవ‌ర్‌ వైపు మళ్లిస్తారు.
  • ముషీరాబాద్‌ నుంచి ట్యాంక్‌బండ్‌ వైపు వచ్చే వాహనాలను కవాడిగూడ క్రాస్‌రోడ్డు వద్ద మళ్లిస్తారు.
  • ఇతర జిల్లాల నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను జేబీఎస్‌ స్వీకార్‌-ఉపకార్‌ వద్ద మళ్లిస్తారు. సిటీ బస్సులను కర్బాలా మైదాన్‌ వద్ద మళ్లిస్తారు.
  • బతుకమ్మ వేడుకలకు వచ్చే వారికి స్నో వరల్డ్‌, ఎన్టీఆర్‌ స్టేడియం, ఎన్టీఆర్‌ గార్డెన్‌ పక్కనే ఉన్న మీ కోసం పార్కింగ్‌ ప్రాంతాలలో పార్కింగ్‌ స్థలాలను కేటాయించారు.