Site icon vidhaatha

Gold-Silver Rates | తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం ధరలు ఇవే.. కొనే ముందు ధరలను చూసుకొని వెళ్లండి..!

Gold-Silver Rates | బంగారం, వెండి ధరలు కొనుగోలుదారులకు ఊరటనిస్తున్నాయి. బులియన్‌ మార్కెట్‌లో ఆదివారం భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల బంగారం తులానికి రూ.67,650 తగ్గి.. 24 క్యారెట్ల పుత్తడిపై తులానికి రూ.73,800 వద్ద నిలకడగా కొనసాగుతున్నది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల పసిడి రూ.68,200 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.74,400కి పెరిగింది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.67,650 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.73,800 వద్ద స్థిరంగా ఉన్నది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.67,800 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.73,950 వద్ద కొనసాగుతున్నది.

ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.67,650 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.73,800 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు పలుకుతున్నాయి. మరో వైపు వెండి నిలకడగా కొనసాగుతున్నది. ఢిల్లీలో ధర వెండి రూ.94,800 చేరింది. హైదరాబాద్‌లో రూ.99,300 పలుకుతున్నది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్‌ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్‌ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.

Exit mobile version