Gold-Silver Rates | మగువకులకు బంగారం ధరలు ఊరటనిస్తున్నాయి. సోమవారం బులియన్ మార్కెట్లో నిలకడగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల బంగారం రూ.66,250 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి తులానికి రూ.72,280 వద్ద నిలకడగా ఉన్నది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.66,850 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.72,930 వద్ద స్థిరంగా ఉన్నది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.66,250 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.72,280 వద్ద స్థిరంగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.66,400 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.72,420 వద్ద కొనసాగుతున్నది.
ఇక హైదరాబాద్లో 22 క్యారెట్ల పసిడి రూ.66,550 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.72,280 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు పలుకుతున్నాయి. మరో వైపు ధర స్వల్పంగా పెరిగింది. కిలోకు రూ.200 పెరిగి.. ఢిల్లీలో ధర వెండి రూ.90,200కు చేరింది. హైదరాబాద్లో రూ.94,700 ధర పలుకుతున్నది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.