Site icon vidhaatha

Gold-Silver Rates | పసిడి కొనేవారికి గుడ్‌న్యూస్‌.. హైదరాబాద్‌లో ధర ఎంత తగ్గిందో తెలుసా..?

Gold-Silver Rates | పుత్తడి ప్రియులకు గుడ్‌న్యూస్‌. బులియన్ మార్కెట్‌లో ధర స్వల్పంగా తగ్గింది. మంగళవారం బులియన్‌ మార్కెట్‌లో పసిడి దిగిరాగా.. వెండి ధర మాత్రం పెరిగింది. 22 క్యారెట్ల బంగారంపై రూ.100 తగ్గి రూ.66,200 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం తులానికి రూ.110 పతనమై రూ.72,220 పలుకుతున్నది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.66,950 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.73,040కి పెరిగింది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.66,200 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.72,220కి తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.66,200 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.72,220కి దిగివచ్చింది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.66,200 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.72,220 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి ధర స్వల్పంగా పెరిగింది. కిలోకు రూ.400 చొప్పున పెరుగుదల నమోదైంది. ఢిల్లీలో కిలో వెండి రూ.91,500వేలు పెరిగింది. ఇక హైదరాబాద్‌లో రూ.96వేలకు ఎగిసింది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్‌ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్‌ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.

Exit mobile version