Gold Rate | పసిడి ధరలు కొనుగోలుదారులకు ఊరటనిస్తున్నాయి. నిన్న స్వల్పంగా దిగివచ్చిన ధరలు మంగళవారం మార్కెట్లో నిలకడగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల బంగారంపై తులానికి రూ.66,550 వద్ద కొనసాగుతున్నది. 24 క్యారెట్ల బంగారం తులానికి రూ.72,600 వద్ద ట్రేడవుతున్నది.
Gold Rate | పసిడి ధరలు కొనుగోలుదారులకు ఊరటనిస్తున్నాయి. నిన్న స్వల్పంగా దిగివచ్చిన ధరలు మంగళవారం మార్కెట్లో నిలకడగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల బంగారంపై తులానికి రూ.66,550 వద్ద కొనసాగుతున్నది. 24 క్యారెట్ల బంగారం తులానికి రూ.72,600 వద్ద ట్రేడవుతున్నది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.67,400 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.73,530 వద్ద స్థిరంగా ఉన్నది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.66,550 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.72,600 వద్ద కొనసాగుతున్నది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.66,700 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.72,750 వద్ద ట్రేడవుతున్నది.
హైదరాబాద్లో 22 క్యారెట్ల పసిడి రూ.65,550 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.72,600 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు ధర స్వల్పంగా తగ్గింది. కిలోకు రూ.100 తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్లో రూ.87,400 పలుతున్నది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.