Gold Rate Hike | షాక్‌ ఇచ్చిన పసిడి, వెండి ధరలు..! రూ.72వేలకు చేరువలో తులం బంగారం..!

  • Publish Date - April 4, 2024 / 10:15 AM IST

Gold Rate Hike | బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పెరుగుతున్న పసిడి ధరలతో సామాన్యులు విలవిల్లాడుతున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌ కొనసాగుతున్నది. ఈ క్రమంలో ధరలు హడలెత్తిస్తున్నాయి. రోజు రోజుకు పసిడి, వెండి ధరలు కొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇటీవల కాలంలో బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి జీవితకాల గరిష్ఠాలను చేరుకుంటుంది. ఈ క్రమంలో దేశీయ మార్కెట్లపై సైతం ప్రభావం పడుతున్నది. తాజాగా గురువారం బులియన్‌ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల బంగారంపై రూ.500 పెరిగి.. తులానికి రూ.64,600కి ఎగిసింది. అదే సమయంలో 24 క్యారెట్ల గోల్డ్‌పై రూ.600 పెరిగి.. తులానికి రూ.70,470 కొత్త రికార్డును నెలకొల్పింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.65,450 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.71,400కి ఎగిసింది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.64,600 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.70,470కి పెరిగింది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.64,260 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.70,030కి పెరిగింది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.64,600 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.70,470 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. అదే సమయంలో వెండి సైతం ఒకే రోజు భారీగా పెరిగింది. ఏకంగా రూ.వెయ్యి పెరిగి కిలో ధర రూ.82వేలకు పెరిగింది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.85,300వేలకు హైదరాబాద్‌లో వెండి ధర పెరగడం ఇదే తొలిసారి. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్‌ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్‌ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.

Latest News