Site icon vidhaatha

Gold Rates | పసిడి ప్రియులకు షాక్‌.. మళ్లీ పెరిగిన ధరలు..

Gold

Gold Rates | పసిడి ధరలు కొనుగోలుదారులకు షాక్‌ ఇచ్చాయి. ఇటీవల వరుసగా రెండురోజుల పాటు తగ్గిన ధరలు బుధవారం బులియన్‌ మార్కెట్‌లో మళ్లీ భారీగానే పెరిగాయి. 22 క్యారెట్ల బంగారంపై రూ.400 పెరిగి తులానికి రూ.67,150కి ఎగిసింది. 24 క్యారెట్ల బంగారం రూ.430 పెరిగి తులానికి రూ.73,250కి చేరింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.67,250 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.73,360కి ఎగిసింది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.67,150 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.73,250కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.67,300 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.73,470కి పెరిగింది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.67,150 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.73,250 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి ధర భారీగా పెరిగింది. రూ.400 వరకు పెరిగి.. ఢిల్లీలో కిలో రూ.87,600కి ఎగిసింది. హైదరాబాద్‌లో రూ.91వేలకు చేరింది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్‌ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్‌ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.

Exit mobile version