Site icon vidhaatha

Gold Rate | మరోసారి పెరిగిన పసిడి ధర..! తులం రూ.72వేలకు చేరువలో..!

goldrate

Gold Rate | బంగారం ధరలు షాక్‌కు గురి చేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ధరలు పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా మరోసారి ధరలు పెరగడంతో ధర జీవనకాల గరిష్ఠానికి చేరుకున్నది. తాజాగా సోమవారం బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. 22 క్యారెట్ల గోల్డ్‌పై రూ.300 పెరగ్గా.. తులానికి రూ.65,650 ధర పలుకుతున్నది. ఇక 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.330 పెరగడంతో 24 క్యారెట్ల పసిడి రూ.71,620కి చేరింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.66,600 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.72,650కి పెరిగింది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.65,650 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.71,620కి ఎగిసింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.65,800 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.71,770 పలుకుతున్నది.

ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.65,650 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.71,620 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. అదే సమయంలో వెండి సైతం భారీగా పెరిగింది. వెండి కిలోకు రూ.84,500 ధర పలుకుతుండగా.. హైదరాబాద్‌లో కిలో ధర రూ.88వేలు ధర పలుకుతున్నది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్‌ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్‌ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.

Exit mobile version