Site icon vidhaatha

Gold Rate | బంగారం కొనుగోలుదారులకు షాక్‌.. మళ్లీ పెరిగిన పసిడి ధర..!

gold

Gold Rate | కొనుగోలుదారులకు పసిడి మళ్లీ షాక్‌ ఇచ్చింది. ఇటీవల తగ్గుతూ వచ్చిన ధరలు బుధవారం మార్కెట్‌లో మళ్లీ పెరిగాయి. వరుసగా రెండురోజుల ధరల పతనం అనంతరం మళ్లీ ధర పెరగడం మొదలైంది. మంగళవారం మార్కెట్‌లో బంగారం ధర భారీగా తగ్గిన విషయం తెలిసిందే. తాజాగా మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారంపై రూ.450 పెరిగి.. తులానికి రూ.66,600కి ఎగిసింది. 24 క్యారెట్ల బంగారంపై రూ.490 పెరిగి రూ.72,650కి చేరింది. అదే సమయంలో వెండి ధర స్వల్పంగా తగ్గింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.67,300 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.73,420కి పెరిగింది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.66,600 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.72,650కి చేరింది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.66,750 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.73,800 ధర పలుకుతున్నది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.66,600 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.72,650కి ఎగిసింది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు ధర పడిపోయింది. కిలోకు రూ.100 తగ్గడంతో ఢిల్లీలో రూ.82,900 తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో రూ.86,400కి చేరింది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్‌ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్‌ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.

Exit mobile version