Gold Rates Hike | మగువలకు బంగారం ధరలు (Gold Rates) షాక్ ఇచ్చాయి. సోమవారం (Monday) బులియన్ మార్కెట్లో ధరలు పెరిగాయి. మరో వైపు వెండి ధరలు (Silver Rates) నిలకడగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల బంగారంపై రూ.200 పెరిగి తులానికి రూ.69,800కి చేరింది. 24 క్యారెట్ల గోల్డ్పై రూ.220 పెరగడంతో తులానికి రూ.76,150కి ఎగిసింది. దేశంలోని వివిధ నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో బంగారం 22 క్యారెట్ల తులానికి రూ.69,800 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.76,150కి చేరింది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ.69,950 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.76,300కి ఎగిసింది. ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్ రూ.69,800 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.76,150కి చేరింది. హైదరాబాద్లో 22 క్యారెట్ల పసిడి రూ.69,800 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.76,150 పలుకుతున్నది.
ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతితో పాటు మిగతా అన్ని నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక వెండి ధర నిలకడగా కొనసాగుతున్నది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో ధర రూ.93వేల వద్ద కొనసాగుతున్నది. హైదరాబాద్లో కిలోకు రూ.98వేల వద్ద నిలకడగా ఉన్నది. బంగారం, వెండి ధరలు రాష్ట్రాలను బట్టి మారుతుంటాయి. ఆయా రాష్ట్రాల్లోని పన్నుల ఆధారంగా ధర మారుతూ వస్తుంది. మరో వైపు ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.