Site icon vidhaatha

Gold-Silver Rates | శుభవార్త.. తగ్గిన బంగారం, వెండి..! తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలు ఇవే..!

Gold-Silver Rates | తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త. బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. సోమవారం బులియన్‌ మార్కెట్‌లో బంగారం, వెండి ధర స్వల్పంగా పతనమైంది. 22 క్యారెట్ల గోల్డ్‌పై రూ.100 తగ్గి తులానికి రూ.67,500కి దిగివచ్చింది. 24 క్యారెట్ల పసిడిపై రూ.110 తగ్గి తులానికి రూ.73,640కి చేరింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.67,850 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.74,020 దిగివచ్చింది. ముంబయిలో 22 క్యారెట్ల రూ.67,500 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.73,640కి తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ.67,650 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.73,790కి తగ్గింది.

ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.67,500 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం పసిడి రూ.73,640 పలుకుతున్నది. ఏపీలోని తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు పలుకుతున్నాయి. వెండి ధర సైతం స్వల్పంగా పతనమైంది. కిలోకు రూ.300 తగ్గింది. దీంతో ఢిల్లీలో కిలో ధర రూ.95,200 ఉండగా.. హైదరాబాద్‌లో కిలో రూ.99,700 పలుకుతున్నది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్‌ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్‌ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.

Exit mobile version