Mahindra XUV 3XO | మార్కెట్‌లోకి మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ.. మే 15 నుంచి బుకింగ్స్‌ షురూ..!

ప్రముఖ దేశీయ ఆటోమొబైల్‌ దిగ్గజం మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ పేరుతో కొత్త మోడల్‌ను మార్కెట్‌లోకి తీసుకువస్తున్నది. ఈ మోడల్‌ ఎక్స్‌యూవీ 300 మోడల్‌కి ఫేసల్‌ లిఫ్ట్‌ వెర్షన్‌ కావడం విశేషం. ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో గట్టి పోటీ ఇవ్వనుందని మార్కెట్‌ నిపుణులు భావిస్తున్నారు. కారును మహీంద్రా సోమవారం లాంచ్‌ చేసింది. రూ.7.49 లక్షల నుంచి ప్రారంభం కానున్నది.

Mahindra XUV 3XO | మార్కెట్‌లోకి మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ.. మే 15 నుంచి బుకింగ్స్‌ షురూ..!

Mahindra XUV 3XO | ప్రముఖ దేశీయ ఆటోమొబైల్‌ దిగ్గజం మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ పేరుతో కొత్త మోడల్‌ను మార్కెట్‌లోకి తీసుకువస్తున్నది. ఈ మోడల్‌ ఎక్స్‌యూవీ 300 మోడల్‌కి ఫేసల్‌ లిఫ్ట్‌ వెర్షన్‌ కావడం విశేషం. ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో గట్టి పోటీ ఇవ్వనుందని మార్కెట్‌ నిపుణులు భావిస్తున్నారు. కారును మహీంద్రా సోమవారం లాంచ్‌ చేసింది. రూ.7.49 లక్షల నుంచి ప్రారంభం కానున్నది. ఇది మధ్య తరగతి ప్రజలకు శుభవార్తే. ఇక మే 15 నుంచి 3ఎక్స్‌ఓ అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ప్రారంభించనున్నట్లు మహీంద్రా పేర్కొంది. అదే నెల 26 నుంచి డెలివరీలు మొదలవుతాయని పేర్కొంది. ఇక కారు డిజైన్‌ విషయానికి వస్తే స్లీక్ పియానో బ్లాక్ ఫినిష్ గ్రిల్, ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్, ఎల్ఈడీ ఫాగ్ లాంప్స్‌తో ఫ్రంట్ లుక్ ఆకట్టుకుంటున్నది.

ఐవరీ కలర్ ఇంటీరియర్స్‌తో కారు లోపలి భాగం రిచ్‌ లుక్‌ కనిపిస్తున్నది. సాఫ్ట్ టచ్ లెదర్ డాష్ బోర్డు, లెదర్ సీట్లు, స్టీరింగ్ పై లెదర్ కవర్, లెదర్ గేర్ నాబ్, లెదర్ ఫ్రంటర్ ఆర్మ్ రెస్ట్‌ కారుకు ప్రీమియం లుక్‌ని తీసుకువచ్చింది. ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓలో ఫార్వార్డ్ విజిబులిటీ యాంగిల్ 23.7 డిగ్రీలు. అయితే, ఇంత వైడ్ యాంగిల్ విజిబులిటీ ఉన్న ఏకైక ఎస్‌యూవీ ఇదే కావడం విశేషం. విజిబులిటీ ద్వారా ముందున్న రోడ్డును స్పష్టంగా చూసే అవకాశం ఉంటుంది. స్పీడ్‌తో పాటు సుపీరియర్ మైలేజ్ ఎఫిషియెన్సీ కోసం వరల్డ్ క్లాస్ ఎంస్టాలియన్ టీజీడీఐ టర్బో ఇంజిన్‌ను అమర్చింది. టీజీడీఐ సాయంతో ఈ కారు కేవలం 4.5 సెకన్లలోనే 60 కిలోమీటర్ల స్పీడ్‌ను అందుకుంటుంది. మాన్యువల్ ట్రాన్స్ మిషన్‌లో ఇది ఒక లీటర్‌కి 20.1 కిలోమీటర్లు మైలేజీ వస్తుంది. కారులో 6 స్పీడ్ ఏఐఎస్ఐఎన్ థర్డ్‌ జనరేషన్‌ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థతో పాటు సిక్స్‌ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్‌ని పొందుపరిచారు. ముఖ్యంగా, మహీంద్రా ఎక్స్ యూవీ 3ఎక్స్ఓ కారులో అత్యాధునిక సస్పెన్షన్ సైతం ఇచ్చారు.

మాక్ ఫెర్సన్ స్ట్రట్ ఫుల్లీ ఇండిపెండెంట్ ఫ్రంట్ సస్పెన్షన్, ట్విస్ట్ బీమ్ సెమీ ఇండిపెండెంట్ రియర్ సస్పెన్షన్‌తో ఎలాంటి రోడ్లపై అయినా ప్రయాణం సాఫీగా సాగుతుందని మహీంద్రా కంపెనీ పేర్కొంది. పనోరమిక్ స్కైరూఫ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, 65 వాట్ యూఎస్‌బీ సీ పోర్ట్ చార్జింగ్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్, 3 స్మార్ట్ స్టీరింగ్ మోడ్స్, లెవెల్ 2 అడాస్ టెక్నాలజీ ఈ ఎస్‌యూవీ ప్రత్యేకతలు. ఇందులో రెండు హెచ్‌డీ స్క్రీన్స్‌ ఉంటాయి. అందులో ఒకటి 26.03 సెంమీ ఇన్ఫోటైన్‌మెంట్‌ స్క్రీన్ కాగా, మరొకటి 26.03 సెంమీ ఫుల్ డిజిటల్ క్లస్టర్ ఉంటుంది. మహీంద్రా ఎక్స్ యూవీ 3ఎక్స్ఓలో సేఫ్టీకి పెద్ద పీట వేశారు. ప్రయాణికుల భద్రత కోసం 6 ఎయిర్ బ్యాగులను ఏర్పాటు చేసింది. బ్లైండ్ వ్యూ మానిటర్‌త కూడిన 360 డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ విత్ హిల్ హోల్డ్, నాలుగు డిస్క్ బ్రేకులు, త్రీ పాయింట్ సీట్ బెల్టులను మహీంద్రా ఇస్తున్నది.