• Telugu News
  • /Business

Cashless Treatment | దేశవ్యాప్తంగా నగదురహిత సేవలు నిలిపివేయనున్న 15,000 ఆసుపత్రులు

సెప్టెంబర్ 1 నుంచి బజాజ్ అలియాంజ్, కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలపై క్యాష్‌లెస్ వైద్యం నిలిచిపోనుంది. AHPI నిర్ణయం కారణంగా రోగులు ముందుగా బిల్లులు చెల్లించి, తర్వాత రీయింబర్స్‌మెంట్ కోసం దరఖాస్తు చేయాల్సి వస్తుంది.

Reported by: Tech | వాణిజ్యం | Aug 27, 2025, 8:07 am IST
Read Time: 4 mins
Cashless Treatment | దేశవ్యాప్తంగా నగదురహిత సేవలు నిలిపివేయనున్న 15,000 ఆసుపత్రులు

హైదరాబాద్ : Cashless Treatment | దేశవ్యాప్తంగా 15 వేలకు పైగా ఆసుపత్రులు సెప్టెంబర్ 1 నుంచి బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ మరియు కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలపై నగదురహిత వైద్య సేవలు నిలిపివేయనున్నట్లు ప్రకటించాయి. ఈ మేరకు ఆసుపత్రుల సంఘం, అసోసియేషన్ ఆఫ్ హెల్త్కేర్ ప్రొవైడర్స్ ఆఫ్ ఇండియా (AHPI) దేశవ్యాప్తంగా ఉన్న తమ సభ్య ఆసుపత్రులకు ఆదేశాలు జారీ చేసింది.

వివాదానికి కారణాలు

ఆసుపత్రులు చెబుతున్న వివరాల ప్రకారం, ఇన్సూరెన్స్ కంపెనీలు బిల్లుల చెల్లింపులో జాప్యం చేస్తుండటం, పాత రేట్లను సవరించకపోవడం ప్రధాన కారణాలు. వైద్య ఖర్చులు సంవత్సరానికి 7 నుండి 8% పెరుగుతుండగా, రీయింబర్స్‌మెంట్ రేట్లు మాత్రం అదే స్థాయిలో ఉండటంతో ఆసుపత్రులు ఆర్థిక ఒత్తిడికి గురవుతున్నాయని డాక్టర్ గిరిధర్ గ్యానీ (డైరెక్టర్ జనరల్, AHPI) పేర్కొన్నారు.

Outdated reimbursement rates తో కొనసాగడం వల్ల రోగుల సేవలు ప్రమాదంలో పడతాయి. మా సభ్య ఆసుపత్రులు దీనిని భరించలేవు.” – డా. గిరిధర్ గ్యానీ

రోగులపై ప్రభావం

ఇప్పటివరకు క్యాష్‌లెస్ ఇన్సూరెన్స్‌ వల్ల రోగులు హాస్పిటల్ బిల్లులు చెల్లించకుండా, కంపెనీ ద్వారా క్లియర్ చేయించుకునే వీలు ఉండేది. ఇకపై బజాజ్ అలియాంజ్ లేదా కేర్ హెల్త్ పాలసీ ఉన్న వారు ముందుగా ఆసుపత్రి ఖర్చులు చెల్లించి, తర్వాత రీయింబర్స్‌మెంట్ కోసం దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో పెద్ద మొత్తాన్ని ఒక్కసారిగా సమకూర్చడం సాధ్యం కాకపోవడం వల్ల, రోగుల కుటుంబాలపై తీవ్ర ఆర్థిక భారం పడనుంది.

ఇన్సూరెన్స్ సంస్థల ప్రతిస్పందన

జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ (GIC) ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా స్పందించింది. “క్యాష్‌లెస్ సర్వీస్ నిలిపివేయడం పౌరులపై భారీ ఆర్థిక భారం మోపుతుంది. రోగుల ఆరోగ్య భద్రత కోసం హెల్త్‌కేర్ ఎకోసిస్టమ్‌ అంతా కలిసి పని చేయాలి.” అని పేర్కొంది.

ర్వాత ఏంటి?

ఆగస్టు 28న AHPI, బజాజ్ అలియాంజ్ అధికారులతో సమావేశం కానుంది. చర్చలు సఫలమైతే కొంత ఉపశమనం లభించవచ్చు. లేకుంటే, రోగులు “reimbursement only” మోడల్‌కే సిద్ధం కావాల్సి ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇలాంటి వివాదాలు తక్షణ పరిష్కారం పొందకపోతే, రోగుల ఆరోగ్య భద్రత, సమయానికి చికిత్స పొందే హక్కులు నష్టపోతారు.