Site icon vidhaatha

Gold Rate | అక్షయ తృతీయకు ముందు గుడ్‌న్యూస్‌.. తగ్గిన బంగారం ధరలు..

Gold Rate | అక్షయ తృతీయకు ముందు బంగారం ధరలు కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. బులియన్‌ మార్కెట్‌లో పసిడి ధర తగ్గుముఖం పట్టింది. 22 క్యారెట్ల బంగారంపై రూ.100 తగ్గి తులానికి రూ.66,250కి తగ్గింది. 24 క్యారెట్ల బంగారం రూ.110 తగ్గి తులానికి రూ.72,270కి దిగివచ్చింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.66,300 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.72,330కి తగ్గింది.

ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.66,250 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.72,270కి దిగివచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.66,400 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.72,420కి చేరింది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.66,250 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.72,270 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి నిలకడగా కొనసాగుతున్నది. ఢిల్లీలో కిలో రూ.85వేలు పలుకుతున్నది.

హైదరాబాద్‌లో రూ.88,500 వద్ద ట్రేడవుతున్నది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్‌ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్‌ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.

Exit mobile version