సంక్రాంతి పండుగ సందర్నంగా ఎగరేసిన పతంగి చైనా మాంజా ధారం మెడకు చుట్టుకుని భారత సైనికుడు మృతి చెందిన ఘటన హైదరాబాద్ లంగర్ హౌజ్లో చోటుచేసుకుంది
హైదరాబాద్లో విషాదం
విధాత : సంక్రాంతి పండుగ సందర్నంగా ఎగరేసిన పతంగి చైనా మాంజా ధారం మెడకు చుట్టుకుని భారత సైనికుడు మృతి చెందిన ఘటన హైదరాబాద్ లంగర్ హౌజ్లో చోటుచేసుకుంది. విశాఖపట్నానికి చెందిన కోటేశ్వరరావు కొన్నాళ్లుగా సైన్యంలో పనిచేస్తున్నారు. విధులు ముగించుకొని ద్విచక్రవాహనంపై ఇంటికి తిరిగి వెళ్తుండగా లంగర్ హౌస్ ఫ్లైవోవర్ వద్ద పతంగుల మాంజా దారం మెడకు చుట్టుకొని గొంతు తెగడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే సమీప ఆస్పత్రిలో చేర్చించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు 304 పార్ట్ 2 కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.