Char Dham Yatra | చార్ధామ్కు యాత్రకు వెళ్లాలనుకునే భక్తులకు ఉత్తరాఖండ్ సర్కార్ గుడ్న్యూస్ చెపింది. ఈ మేరకు యాత్రకు సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేసింది. మే 10 నుంచి చార్ధామ్ యాత్ర ప్రారంభమై. సుమారు ఆరు నెలల పాటు కొనసాగుతుందని పేర్కొంది.
Char Dham Yatra | చార్ధామ్కు యాత్రకు వెళ్లాలనుకునే భక్తులకు ఉత్తరాఖండ్ సర్కార్ గుడ్న్యూస్ చెపింది. ఈ మేరకు యాత్రకు సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేసింది. మే 10 నుంచి చార్ధామ్ యాత్ర ప్రారంభమై. సుమారు ఆరు నెలల పాటు కొనసాగుతుందని పేర్కొంది. మే 10న మొదలై.. అక్టోబర్ 31తో ముగియనున్నదని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు యాత్రకు 19లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
గతేడాది యాత్రకు 55లక్షల మంది భక్తులు తరలివచ్చినట్లు అధికారులు వివరించారు. గతేడాది రద్దీ నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులుపడ్డారని, ఈసారి ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఏర్పాట్లు చేస్తన్నట్లు చెప్పారు. ఈ క్రమంలో యాత్రకు వెళ్లే భక్తులకు పలు షరతులు విధించింది. రోజువారీగా యాత్రకు వెళ్లే భక్తులపై పరిమితి విధిస్తూ నిర్ణయం తీసుకున్నది. యాత్రలో భాగంగా కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రిని సందర్శిస్తారు. ఈ ఆలయాలను సందర్శించే భక్తులపై పరిమితిని ప్రభుత్వం విధించింది.
యాత్రలో కేదార్నాథ్ ధామ్లో బాబా మహాకాల్ను రోజుకు 15వేల మంది భక్తులు మత్రమే దర్శనం చేసుకునేలా పరిమితి విధించింది. అలాగే బద్రీనాథ్లో కేవలం రోజులు 16వేల మంది మాత్రమే దర్శించుకునేలా ఏర్పాట్లు చేసింది. గంగోత్రిలో 11వేల మంది.. యమునోత్రిలో 9వేల మంది భక్తులు దర్శించుకునేలా ఉత్తరాఖండ్ సర్కారు పరిమితి విధించింది. భక్తుల సంఖ్య ఎక్కువ అయితే రిషికేష్లోనే వారిని అడ్డుకునేలా ఏర్పాట్లుటాయి.
యాత్రలో భాగంగా బద్రీనాథ్ వెళ్లాలనే భక్తులను శ్రీనగర్లోనే ఆపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా రాత్రి శ్రీనగర్లోనే బస చేయాల్సి ఉంటుంది. అనంతరం రుద్రప్రయాగ్, చమోలి, పిప్పల్కోట్, జోషిమఠ్లలో ఆ తర్వాతి రోజు యాత్ర కొనసాగతుంది. యాత్రలో భాగంగా భక్తులు మొదట యమునోత్రిని దర్శిస్తారు. ఆ తర్వాత గంగోత్రి ధామ్కి బయలుదేరి వెళ్తారు. ఆ తర్వాత కేదార్నాథ్లో దర్శనం చేసుకుంటారు. చివరగా బద్రీనాథ్ ధామ్కు వెళ్తారు. భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉండడంతో అధికారులు మే 25 వరకు వీఐపీలు యాత్రకు రావ్వొద్దని ఉత్తరాఖండ్ సీఎస్ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు లేఖ రాశారు.