Chiru -Bobby | చిరంజీవి -బాబీ ప్రాజెక్ట్ కథ మారిందా.. స్టార్ హీరో కీలక పాత్రతో అంచనాలు పీక్స్లో..!
Chiru -Bobby | తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తిరుగులేని ఇమేజ్తో మెగాస్టార్గా నిలిచిన చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’ పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి.
Chiru -Bobby | తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తిరుగులేని ఇమేజ్తో మెగాస్టార్గా నిలిచిన చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’ పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. మెగా అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తున్నాడన్న విషయం సినిమాపై హైప్ను మరింత పెంచింది. సంక్రాంతి కానుకగా 2026 జనవరి 12న విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా ట్రైలర్కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. చిరంజీవి స్టైలిష్ లుక్, పవర్ఫుల్ మాస్ డైలాగ్స్, ఎమోషనల్ టచ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కూడా మెగా ఫ్యాన్స్కు పండుగలా మారింది.
వెంకటేష్ పాత్రపై భారీ ఆసక్తి
‘మన శంకర వర ప్రసాద్ గారు’లో వెంకటేష్ పోషిస్తున్న పాత్రపై ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దర్శకుడు అనిల్ రావిపూడి ఈ పాత్రను చాలా ప్రత్యేకంగా డిజైన్ చేశాడని టాక్. చిరంజీవి – వెంకటేష్ కాంబినేషన్ తెరపై మరోసారి కనిపించనుండటంతో ప్రేక్షకుల అంచనాలు మరింత పెరిగాయి.
చిరంజీవి నెక్ట్స్ మూవీపై బజ్
ఈ సినిమాతో పాటు మెగాస్టార్ తదుపరి ప్రాజెక్ట్ కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ‘వాల్తేరు వీరయ్య’తో చిరంజీవికి బ్లాక్బస్టర్ ఇచ్చిన దర్శకుడు బాబీతో చిరు తన కెరీర్లో 158వ సినిమాను చేయనున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. గత సంక్రాంతికి నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘డాకు మహారాజ్’తో భారీ విజయాన్ని అందుకున్న బాబీ, ఇప్పుడు మరోసారి మెగాస్టార్తో మాసివ్ హిట్ కొట్టాలని గట్టిగా ప్లాన్ చేస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది.
కథలో మార్పులు?
ముందుగా అనుకున్న కథ బాగానే ఉన్నప్పటికీ, దానికి దగ్గరగా ఉండే కథతో ఇటీవల ఓ సినిమా రావడంతో అదే తరహా కథను రిపీట్ చేయకూడదన్న ఆలోచనతో బాబీ స్క్రిప్ట్లో మార్పులు చేస్తున్నారని సమాచారం. అందుకే చిరంజీవి – బాబీ కాంబోలో రాబోయే సినిమా పూర్తిగా కొత్త కాన్సెప్ట్తో, మాస్ ఎలిమెంట్స్తో పాటు బలమైన ఎమోషన్ ఉండేలా రూపొందనుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ను మెగాస్టార్ కెరీర్లో మరో మైలురాయిగా నిలిచేలా బాబీ డిజైన్ చేస్తున్నాడని టాక్. ఇప్పటివరకు చూడని కొత్త షేడ్లో చిరంజీవిని చూపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట.
మోహన్ లాల్ ఎంట్రీపై చర్చ
ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం మలయాళ స్టార్ మోహన్ లాల్ను తీసుకునే ఆలోచనలో చిత్రబృందం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవి – మోహన్ లాల్ కాంబినేషన్ మరోసారి తెరపై కనిపిస్తే అది ప్రేక్షకులకు ప్రత్యేక ఆకర్షణగా మారుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తానికి, ‘మన శంకర వర ప్రసాద్ గారు’తో పాటు చిరంజీవి నెక్ట్స్ మూవీపై కూడా ఆసక్తికరమైన అప్డేట్స్ రావడంతో మెగా అభిమానుల్లో జోరు పెరిగింది. రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్ట్స్పై మరిన్ని అధికారిక ప్రకటనలు వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram