MSG | ‘మన శంకర వర ప్రసాద్ గారు’ అడ్వాన్స్ బుకింగ్స్లో దూకుడు.. లెక్కలు చూస్తే మైండ్ బ్లాకే..!
MSG | టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సంక్రాంతి కానుకగా జనవరి 12, 2026న గ్రాండ్ రిలీజ్కు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మెగాస్టార్ సినిమా అంటేనే పండుగ వాతావరణం ఉండగా, సంక్రాంతి సీజన్ కావడంతో ఈ సినిమాపై క్రేజ్ మరింతగా పెరిగింది.
MSG | టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సంక్రాంతి కానుకగా జనవరి 12, 2026న గ్రాండ్ రిలీజ్కు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మెగాస్టార్ సినిమా అంటేనే పండుగ వాతావరణం ఉండగా, సంక్రాంతి సీజన్ కావడంతో ఈ సినిమాపై క్రేజ్ మరింతగా పెరిగింది.ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఫ్యామిలీ ఆడియన్స్ను ఆకట్టుకునే వినోదాత్మక చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన ట్రాక్ రికార్డ్ ఏర్పరుచుకున్న అనిల్ రావిపూడి, ఈసారి మెగాస్టార్తో కలిసి పూర్తి స్థాయి ఎంటర్టైనర్ను అందిస్తున్నాడు.
చిరంజీవి సంక్రాంతి సెంటిమెంట్, అనిల్ స్టైల్ ఎంటర్టైన్మెంట్ కలిసి సినిమాకు పెద్ద బలంగా మారాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి పోటీ సినిమాలు ఉన్నప్పటికీ, ‘మన శంకర వర ప్రసాద్ గారు’కు ప్రత్యేక అడ్వాంటేజ్ ఉందని విశ్లేషిస్తున్నారు.ఇక అడ్వాన్స్ బుకింగ్స్ విషయానికి వస్తే, నార్త్ అమెరికాలో ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. అక్కడ ఈ సినిమా మంచి జోరు చూపిస్తోంది. ఇతర భారీ పాన్ ఇండియా సినిమాలతో పోల్చినా, భారీ స్థాయిలో టికెట్లు అమ్ముడవుతున్నట్లు సమాచారం. తాజా అప్డేట్ ప్రకారం, అమెరికాలో ప్రీమియర్ అడ్వాన్స్ బుకింగ్స్లో సినిమా దాదాపు 1.20 లక్షల డాలర్ల మార్క్ను చేరుకుంటోంది. ఇది భారతీయ కరెన్సీలో రూ.1 కోటికి పైగా గ్రాస్ కావడం విశేషం.
ఇంకా సినిమా రిలీజ్కు దాదాపు 9 రోజులు సమయం ఉండటంతో ఈ నంబర్లు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా జనవరి 4, 2026న విడుదల కానున్న ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటే, ఫ్యామిలీ ఆడియన్స్ భారీగా థియేటర్లకు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి తొలిసారి పూర్తి స్థాయి కామెడీ పాత్రలో కనిపించబోతుండటం ప్రధాన హైలైట్. ఆయనకు జోడీగా నయనతార నటిస్తుండగా, మరో కీలక పాత్రలో విక్టరీ వెంకటేష్ కనిపించబోతుండడం సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. ఇద్దరు స్టార్ హీరోలు ఒకే సినిమాలో నటించడం ఈ చిత్రానికి పెద్ద ప్లస్గా మారింది.
అలాగే కేథరిన్ ట్రెసా, సునీల్, వీటీవీ గణేష్, రేవంత్, హర్షవర్ధన్, సచిన్ ఖేడేకర్, అభినవ్ గోమటం వంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు ప్రధాన బలంగా నిలవనున్నాయని చిత్రబృందం నమ్మకంగా ఉంది.
షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మొత్తం మీద, ‘భోలా శంకర్’ తర్వాత చిరంజీవికి ఈ సినిమా ఒక బలమైన కంబ్యాక్గా నిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ జోరు చూస్తే, ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద మాస్ రచ్చ చేయడం ఖాయమే అని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram