సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ట్రైనీ ఐఏఎస్ లు

2025 బ్యాచ్ ట్రైనీ ఐఏఎస్ అధికారులు హైదరాబాద్ ఎంసీఆర్ హెచ్ఆర్డీలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పలు అంశాలపై చర్చించారు.

Reported by: Tejaswini Nanna | హైదరాబాద్​ | May 20, 2026, 2:11 pm IST
Read Time: 2 mins
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ట్రైనీ ఐఏఎస్ లు

హైదరాబాద్ ఎంసీఆర్ హెచ్ఆర్డీ(MCRHRD)లోని భోది పెవిలియన్ లో సీఎం రేవంత్ రెడ్డిని 2025 బ్యాచ్‌ ట్రైనీ ఐఏఎస్ (IAS) అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో శిక్షణలో ఉన్న ఐఏఎస్‌లు ఎట్టబోయిన సాయి శివాని, సచిన్ బసవరాజ్ గుత్తూర్, పోతరాజు హరి ప్రసాద్, పారస్ కుమార్, పి. సురేష్, నెలటూరు శ్రీకాంత్ రెడ్డి ఉన్నారు.

ఈ సమావేశంలో ఎంసీఆర్ హెచ్ఆర్డీ వైస్ చైర్మన్ శాంతి కుమారి, కోర్స్ డైరెక్టర్ కందుకూరి ఉషారాణి పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

పురావస్తు, పర్యాటక శాఖలలో టూరిస్టు గైడ్ పోస్టులు
మెలోని-మోదీల మెలోడీ బంధం వైరల్!