హర్మూజ్ జలసంధిలో టోల్ చార్జీలు: ఇరాన్ కీలక ప్రకటన

హర్మూజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలపై కొత్త సేవా రుసుములు విధించనున్నట్లు చైనాలో ఇరాన్ రాయబారి వెల్లడించారు ఇటీవల జరిగిన ఘర్షణల సమయంలో ఇరాన్‌కు మద్దతు ఇచ్చిన దేశాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇవ్వడం గమనార్హం.

విధాత: హర్మూజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలపై కొత్త సేవా రుసుములు విధించనున్నట్లు చైనాలో ఇరాన్ రాయబారి వెల్లడించారు ఇటీవల జరిగిన ఘర్షణల సమయంలో ఇరాన్‌కు మద్దతు ఇచ్చిన దేశాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇవ్వడం గమనార్హం. బీజింగ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఇరాన్ రాయబారి అబ్దుల్ రెజా రహ్మానీ ఫజ్లీ ఈ ప్రకటన చేశారు. ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యూహాత్మక జలమార్గంలోవెళ్లే వాణిజ్య నౌకల నౌకల రవాణా నిర్వహణలో కొత్త ఏర్పాట్లపై ఒమన్‌తో కలిసి ఇరాన్ పనిచేస్తున్నట్లు వెల్లడించారు.

శాంతి ఒప్పందంపై ప్రభావం చూపుతుందా.?

హర్మూజ్ మార్గంలో నౌకలపై రుసుముల ఆలోచనను అమెరికా తిరస్కరించినప్పటికీ.. ఇరాన్ రాయబారి రుసుము విధింపు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.కాల్పుల విరమణ అనంతరం ఇరాన్, అమెరికాల మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందం ప్రకారం, వాణిజ్య నౌకలు 60 రోజుల పాటు హోర్ముజ్‌ను ఉచితంగా ఉపయోగించుకోవడానికి అనుమతించబడ్డాయి. ఈ ఒప్పందం తర్వాత ఇరాన్ రాయబారి నుంచి కొత్త ప్రతిపాదన రావడం చర్చనీయాంశమైంది. కొత్త రవాణా వ్యవస్థ,రవాణా రుసుములు ఎప్పుడు అమల్లోకి వస్తాయన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు.వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ఈ జలమార్గం గుండా వాణిజ్య నౌకాయానాన్ని నియంత్రించేందుకు ఒక దీర్ఘకాలిక విధానాన్ని ఏర్పాటు చేయడానికి ఇరాన్ సిద్ధమవుతోందని ఆ దేశం తాజాగా చేసిన ప్రకటన సూచిస్తోంది.

సుంకంగా పరిగణించవద్దట..

ఇరాన్ రాయబారి వ్యాఖ్యల మేరకు..జలసంధి గుండా వెళ్లే నౌకలకు అందించే సేవలపై ఇరాన్ రుసుములను విధిస్తుందని ఫజ్లీ తెలిపారు. అయితే, వీటిని రవాణా సుంకంగా పరిగణించరాదని ఆయన నొక్కి చెప్పారు.”హోర్ముజ్ జలసంధి మా ప్రాదేశిక జలాల్లో భాగంగా ఉన్నందున, మేము ఖచ్చితంగా సేవా రుసుములను వసూలు చేస్తాము,” అని ఆయన అన్నారు.ఈ రుసుములు నౌకాయాన భద్రతను నిర్ధారించడం, ఓడల కదలికలను పర్యవేక్షించడం, అధిక సముద్ర రవాణా వలన కలిగే పర్యావరణ ప్రభావాన్ని పరిష్కరించడం వంటి సేవలకు వర్తిస్తాయని చెప్పుకొచ్చారు. హోర్ముజ్ జలసంధి సరిహద్దును పంచుకుంటున్న ఒమాన్‌తో సమన్వయం చేసుకుంటూ, కొత్త ఏర్పాట్లను రూపొందిస్తున్నట్లు తెలిపారు.

మిత్ర దేశాలకు ప్రాధాన్యత

ఇటీవలి అమెరికా, ఇజ్రాయెల్ తో యుద్ద సమయంలో ఇరాన్‌కు మద్దతు ఇచ్చిన దేశాలకు హర్మూజ్ జలసంధి మార్గంలో టెహ్రాన్ అనుకూలమైన నిబంధనలను అందిస్తుందని రాయబారి ఫజ్లీ సూచించారు.మాకు స్నేహపూర్వకంగా ఉండి, కష్ట సమయాల్లో ప్రత్యేకంగా మాకు అండగా నిలిచిన దేశాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడాన్ని మేము ఖచ్చితంగా పరిశీలిస్తామని ఆయన అన్నారు. అయితే ఏ దేశాలు ఈ ప్రాధాన్యతకు అర్హత పొందుతాయో రాయబారి స్పష్టం చేయలేద. అలాగే ఈ విధానాన్ని ఎలా అమలు చేస్తారో కూడా వివరించలేదు.

ప్రపంచ ఇంధన వాణిజ్యానికి ఈ జలమార్గమే కీలకం

హోర్ముజ్ జలసంధి ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన షిప్పింగ్ మార్గాలలో ఒకటి. ఇది ప్రపంచ ముడి చమురులో దాదాపు 20 శాతాన్ని రవాణా చేస్తుంది. ఈ ఇరుకైన జలమార్గం గుండా రవాణాకు ఏదైనా అంతరాయం కలిగితే, అది ప్రపంచ ఇంధన సరఫరాలను, ఇంధన ధరలను ప్రభావితం చేస్తుంది. పశ్చిమ ఆసియాలో ఇటీవల జరిగిన సంఘర్షణ సమయంలో, ఇరాన్ ఈ జలసంధి గుండా వాణిజ్య రాకపోకలను సమర్థవంతంగా నిరోధించింది.ఇది ప్రపంచ చమురు సరఫరాల గొలుసును దెబ్బతీసి ఇంధన ధరలు విపరీతంగా పెరగడానికి కారణమైంది.

యుద్ద ఉద్రిక్తతలు నిలిపివేయడానికి ఇరాన్, యునైటెడ్ స్టేట్స్ ఒక ప్రాథమిక ఒప్పందానికి వచ్చిన తర్వాత ఈ జలమార్గం తిరిగి తెరవబడింది. ఆ ఒప్పందంలో భాగంగా, వాణిజ్య నౌకలు 60 రోజుల పాటు ఎలాంటి రుసుములు చెల్లించకుండా జలసంధి గుండా ప్రయాణించడానికి అనుమతించబడ్డాయి.

Latest News