టెక్సాస్​లో ఘోర కారు ప్రమాదం – ముగ్గురు తెలుగు వారితో సహా ఐదుగురు దుర్మరణం

టెక్సాస్(Texas)​ ప్రజా రక్షణ విభాగం(Department of Public Safety)) సమాచారం ప్రకారం హైవే మీద జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు కార్లు కాలిపోగా, ఐదుగురు మరణించారు. ఒకరు తీవ్రంగా గాయపడగా, ఆసుపత్రికి తరలించారు.

టెక్సాస్​లో ఘోర కారు ప్రమాదం – ముగ్గురు తెలుగు వారితో సహా ఐదుగురు దుర్మరణం

అమెరికా, టెక్సాస్​లోని ఫానిన్​(Fannin) కౌంటీలో నేడు జరిగిన కారు ప్రమాదంలో ఐదుగురు మరణించారు(Five dead). ఇందులో ముగ్గురు తెలుగువాళ్లు(Three are from AP) కూడా ఉన్నారు. ఇంకా ఒకరు తీవ్రగాయాలతో బయటపడగా, హెలీకాప్టర్లో ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.

స్థానిక మీడియా కథనాల ప్రకారం, బాన్​హమ్​,టెంటాన్​ మధ్య స్టేట్​ హైవే 121(SH 121) పై సాయంత్రం 5.55 ని.లకు ఈ ప్రమాదం జరిగింది. టెక్సాస్​ ప్రజా రక్షణ విభాగం నో పాసింగ్​ జోన్​లోకి ఒక కారు చొచ్చుకువచ్చి, మరో కారును ఢీకొట్టడంతో రెండు కార్లలో మంటలు చెలరేగాయి.

మృతుల్లో ఇద్దరు ఒక కార్లో ఉండగా, వారినింకా గుర్తించాల్సిఉంది. మరో కార్లో ఉన్న ముగ్గురు ఆంధ్రప్రదేశ్​ వాసులు కూడా చనిపోయారు. వారిని గూడూరు(Guduru)కు చెందిన గోపి తిరుమూరు, శ్రీకాళహస్తి(Sri Kalahasti)కి చెందిన రాజినేని శివ, హరిత చెన్నుగా గుర్తించారు. హరిత భర్త సాయి చెన్ను తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు.