విధాత: దేవుడి ప్రతినిధిగా భావించే పూజారి రాక్షసుడిగా మారిపోయి మహిళలపై అఘాయిత్యానికి పాల్పడేందుకు యత్నించి దేహశుద్దికి గురైన ఘటన వారణాసి గంగా ఘాట్ లో చోటుచేసుకుంది. తమ సమస్యలు చెప్పుకుని దోష నివారణకు పూజలు చేయించుకునేందుకు వచ్చిన మహిళల పట్ల ఓ పూజారి కామాంధుడిగా మారి గంగా నది జలాల్లో పడవపైనే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
పూజారి వక్రబుద్దిని గ్రహించిన బాధిత మహిళలు ఇద్దరు పడవలోనే అతడిపై దాడికి దిగారు. నన్నే కొడతారా అంటూ మహిళలపై పూజారి ఎదురు దాడి చేసి..వాళ్ల బట్టలు చించి అవమానపరిచే ప్రయత్నం చేశాడు. ఇంతలో చుట్టుపక్కల బోట్ లలోని వారు అక్కడికి చేరుకోవడంతో పూజారి పడవ నుంచి గంగానదిలోకి దూకేసి పారిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. ఈ ఘటన డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న ఉత్తరప్రదేశ్ లోని ప్రసిద్ద వారణాసిలోని గంగా ఘాట్ లో జరుగడంతో ప్రతిపక్షాలు భారీ ఎత్తున ట్రోల్స్ చేస్తున్నాయి.
వారణాసి గంగా ఘాట్లో దారుణం: మహిళలపై పూజారి అసభ్య ప్రవర్తన
వారణాసి: ఉత్తరప్రదేశ్లోని వారణాసి గంగా ఘాట్ వద్ద ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. పడవ ప్రయాణంలో ఉన్న ఇద్దరు మహిళలతో ఒక పూజారి అత్యంత అసభ్యంగా ప్రవర్తించినట్లు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది.
గంగానదిలో… pic.twitter.com/Yo66vkAhYC
— AVM (@AvmNews7) March 31, 2026
ఇవి కూడా చదవండి :
Muzaffarnagar Highway Accident : లక్కీ స్పాట్.. తప్పిన చావు !
Stampede At Sheetla Temple | ఆలయంలో తొక్కిసలాట.. 8 మంది భక్తుల మృతి!
