యంగ్ టైగర్ ఎన్టీఆర్కి మంచి వాక్చాతుర్యం ఉంది. ఆయన సినిమాల గురించైన రాజకీయాల గురించైన లేదంటే ఇతర విషయాలపైన కూడా చాలా అనర్గళంగా మాట్లాడగలరు. అయితే దేవర సినిమా షూటింగ్తో కొన్నాళ్లుగా బిజీగా ఉన్న ఎన్టీఆర్ టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్కి హాజరై సందడి చేశాడు. ఆయనతో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్, విశ్వక్ సేన్ కూడా స్పెషల్ గెస్ట్లుగా పాల్గొన్నారు. ఇక ఈ ఈవెంట్ లో ఎన్టీఆర్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అండ్ ప్రభాస్ సినిమాలోని డైలాగ్స్ చెప్పి అందరిని ఉత్సాహపరిచారు. సూపర్ హిట్ సినిమా సీక్వెల్ చేయాలంటే చాలా భయం ఉంటుంది. సీక్వెల్ మొదటి సినిమాని మించి మెప్పించకపోతే విమర్శలు బారిన పడాల్సి వస్తుంది.
దాని గురించి ఎన్టీఆర్ మాట్లాడుతూ… కల కనడానికి ఒక ధైర్యం ఉండాలి. అయితే ఆ కలని నిజం చేసుకోవడానికి భయం ఉండాలి” అని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ముందు ఆ డైలాగ్ చెప్పారు. ఇక ఆ తర్వాత కుదిరితే సరిదిద్దండి, లేదంటే క్షమించండి. అంతేగాని నేను ఇక్కడ ఉన్నానని గుర్తించండి. ఐయామ్ టెల్లింగ్ దట్. పోలె అదిరిపోలే” అంటూ అత్తారింటికి దారేది, కింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాల్లోని డైలాగ్స్ ని మీమ్ లాంగ్వేజ్ లో మాట్లాడి ప్రతి ఒక్కరిని అలరించాడు. ఎన్టీఆర్ చెప్పిన డైలాగులకి ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. టిల్లు క్యారెక్టర్ అనేది కేవలం సినిమా మాత్రమే కాదని.. అలాంటి ఒక క్యారెక్టర్ ని క్రియేట్ చేసినందుకు డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ టీమ్ కి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాడు తారక్.
ఇక పనిలో పనిగా తన తాజా చిత్రం దేవర మూవీ గురించి కూడా మాట్లాడాడు. దేవర సినిమాలో ఎక్కువ శాతం భయం ఉంటుంది అని, మెయిన్ ప్లాట్ అంతా భయం బ్యాక్ డ్రాప్ లోనే తిరుగుతుందని చెప్పుకొచ్చాడు. దేవరలో ఉండే ఒక డైలాగ్ ప్రస్తావన తీసుకొచ్చాడు. కానీ, తారక్ డైలాగ్ మాత్రం చెప్పలేదు. కానీ, సినిమా గురించి మాత్రం నెక్ట్స్ లెవల్లో హైప్ అయితే క్రియేట్ చేశాడు ఎన్టీఆర్. “ఇతి కాస్త ఎక్కువ అయ్యింది అనుకోవద్దు. చొక్కా ఉంటుంది.. దానికి ఒక కాలర్ అనేది ఉంటుంది. మీరు దేవర సినిమా చూశాక కాలర్ ఎగరేసుకునేలా ఉంది అనుకుంటారు. కాస్త ఆలస్యం అయ్యిందని డీలా పడకండి. మీరు కాలర్ ఎగరేసుకునేలా సినిమాని తీస్తున్నాం” అంటూ తారక్ అబిమానుల జోష్ని మరింత పెంచేశాడు.