సల్మాన్ ఇంటి వద్ద కాల్పలు కలకలం..బైక్పై వచ్చి అరాచకం
Salman Khan: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇటీవల పలు వివాదాలతో హాట్ టాపిక్ అవుతున్న విషయం తెలిసిందే. ఆయనకి థ్రెట్ ఉందన్న విషయం తెలిసిందే. గతేడాది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సల్మాన్ ఖాన్ను చంపేస్తానంటూ ఓపెన్గా చెప్పాడు.సల్మాన్ ఖాన్ని చంపడమే తన జీవిత లక్ష్యం అంటూ ఆయన తెలియజేశాడు. అప్పటి నుండి సల్మాన్ ఖాన్ టైట్ సెక్యూరిటీ మధ్య ఉంటున్నాడు. అయితే ఆదివారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో సల్మాన్ ఇంటి పరసర ప్రాంతంలో కాల్పుల కలకలం రేగింది. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్పై వచ్చి ముంబై బాంద్రాలోని సల్మాన్ ఇంటి ముందు గాలిలో రెండు రౌండ్లు కాల్పులు జరిపినట్లు సమాచారం.
వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు నిందితులు ఎవరనే దానిపై ఆరాలు తీస్తున్నారు. సల్మాన్ ఇంటి దగ్గర్లోని సీసీ కెమెరాల ద్వారా నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. సల్మాన్ ఇంటి ముందు ఎందుకు గాల్లోకి కాల్పులు జరపాల్సి వచ్చింది అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆందోళనలో ఉన్నారు. గతంలో సల్మాన్కి చాలా సార్లు హత్య బెదిరింపులు రాగా, ఇప్పుడు ఆయన ఇంటి దగ్గర కాల్పులు జరగడం ఆందోళన కలిగిస్తుంది. ఇద్దరు వ్యక్తులు గాలిలో రెండు రౌండ్లు కాల్పులు జరిపినట్టు చెబుతున్నారు.
ఈ ఘటన జరిగిన తర్వాత బాంద్రాలోని సల్మాన్ ఖాన్ గెలాక్సీ నివాసం ముందు భారీగా పోలీసులు మోహరించారు. కాగా, 1998లో కృష్ణజింకలని సల్మాన్ వెటాడినందుకే అతడిని చంపాలనుకున్నట్లు లారెన్స్ బిష్ణోయ్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. లారెన్స్ బెదిరింపుల తర్వాత ఆయన ఇంటి వద్ద టైట్ సెక్యూరిటీని ఉంచారు. అయినప్పటికీ ఇలాంటి ఘటనలు జరుగుతుండడం అభిమానులకి ఆందోళన కలిగిస్తుంది. సల్మాన్ ఖాన్ ఇంటిపై జరిపిన కాల్పుల ఘటనపై పలువురు సినీ, రాజకీయ నేతలు ఖండించారు. శివసేన నాయకుడు ఆనంద్ దుబే ఘాటుగా స్పందిస్తూ… ముంబై నగరంలో క్రిమినల్స్ యదేచ్ఛగా తిరుగుతున్నారని, ఇక్కడ సురక్షితంగా జీవించే పరిస్థితులు లేవు అని అన్నారు.