విధాత: ఏపీలో 411 ఎస్ఐ ఉద్యోగాల భర్తీ కోసం ఫిబ్రవరి 19న నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షకు 1,51,288 మంది అభ్యర్థులు హాజరుకాగా, 57,923 మంది అర్హత సాధించారు. 1,553 అభ్యంతరాలు స్వీకరించినట్లు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వెల్లడించింది.
మార్చి 4న ఉదయం 11 గంటల వరకు ఓఎంఆర్ షీట్స్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది. రెండు పేపర్లలో అర్హత సాధించిన వారికే ఫిజికల్ టెస్ట్లు నిర్వహించనున్నట్లు బోర్డు తెలిపింది. పరీక్ష ఫలితాల కోసం ఈ కింది లింక్ ను క్లిక్ చేయండి. https://slprb.ap.gov.in/UI/SIResults