‘అల్లు’వారి ఫ్రీ రిలీజ్‌కు బాలకృష్ణ: బాలయ్య ఇమేజ్ తగ్గిందా.. అల్లు ఇమేజ్ పెరిగిందా?

విధాత,సినిమా: నందమూరి నటసింహం బాలయ్య ఇమేజ్ తగ్గిందా? లేదంటే అల్లు ఫ్యామిలీ ఇమేజ్ పెరిగిందా? చూస్తుంటే ఏదీ అర్థం కావడం లేదు.. లేదంటే అల్లు శిరీష్ సినిమా వేడుకకు బాలయ్య ముఖ్య అతిథిగా రావడమేంటి? ఆశ్చర్యంగా ఉంది కదా. మెగా ఫ్యామిలీకి, నందమూరి ఫ్యామిలీకి మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి.. కానీ వారి అభిమానులకు మాత్రం ఒకరంటే ఒకరికి పడదు. సోషల్ మీడియా అనే కాకుండా.. థియేటర్ల దగ్గర, ఇంకా ఇతరత్రా విషయాలలో కూడా వారు గొడవలు […]

  • Publish Date - October 26, 2022 / 05:15 PM IST

విధాత,సినిమా: నందమూరి నటసింహం బాలయ్య ఇమేజ్ తగ్గిందా? లేదంటే అల్లు ఫ్యామిలీ ఇమేజ్ పెరిగిందా? చూస్తుంటే ఏదీ అర్థం కావడం లేదు.. లేదంటే అల్లు శిరీష్ సినిమా వేడుకకు బాలయ్య ముఖ్య అతిథిగా రావడమేంటి? ఆశ్చర్యంగా ఉంది కదా. మెగా ఫ్యామిలీకి, నందమూరి ఫ్యామిలీకి మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి.. కానీ వారి అభిమానులకు మాత్రం ఒకరంటే ఒకరికి పడదు. సోషల్ మీడియా అనే కాకుండా.. థియేటర్ల దగ్గర, ఇంకా ఇతరత్రా విషయాలలో కూడా వారు గొడవలు పడుతుంటారు.

కానీ ఇప్పుడు అల్లు వారు ‘మెగా’ని వదిలించుకునే ప్రయత్నాల్లో ఉన్నారనేలా ఈ మధ్య ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి. అందులో భాగంగానే బాలయ్య చుట్టూ ఆ ఫ్యామిలీ తిరుగుతుందని.. ఇండస్ట్రీ పీపుల్ చాలా మంది మాట్లాడుకుంటున్నారు.

సరొగసి: నయన్, విఘ్నేష్‌‌‌లు.. ఎలాంటి తప్పు చేయలేదట!

ఎందుకంటే, అల్లు అరవింద్ ‘ఆహా’ ఓటీటీలో బాలయ్య ‘అన్‌స్టాపబుల్’ టాక్ షో‌కి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అలాగే ఆ మధ్య బాలయ్య సినిమా ‘అఖండ’ ప్రీ రిలీజ్ వేడుకకు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరై.. బాలయ్యపై పొగడ్తల వర్షం కురిపించాడు.

ఇప్పుడు అల్లు శిరీష్ హీరోగా నటించిన ‘ఊర్వశివో రాక్షసివో’ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకకు బాలయ్య ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నాడు. చూస్తుంటే ఇదంతా.. ‘మెగా’పై పై చేయి సాధించేందుకే ‘అల్లు’ ప్రయత్నం అన్నట్లుగా కనిపిస్తోంది.

ఏదిఏమైనా.. అల్లు శిరీష్ సినిమా వేడుకకు బాలయ్య రావడమనేది.. అల్లు అభిమానులేమోగానీ.. నందమూరి అభిమానులు మాత్రం అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు.

బాలయ్యతో పోల్చుకుంటే.. మెగాస్టార్ చిరంజీవి తలాతోకా లేని సినిమాల ప్రీ రిలీజ్ వేడుకలకు కూడా ముఖ్య అతిథిగా వెళుతున్నాడు కదా.. అల్లు ఫ్యామిలీ హీరో ఫంక్షన్‌కి వెళితే తప్పేంటి? అని వాదించే వారు లేకపోలేదు. కరెక్టే కానీ.. ఈ విషయంలో చిరంజీవి వేరు, బాలయ్య వేరు. చిరంజీవి కొత్తగా చేస్తున్న పని కాదది. ఆయన ఎప్పటి నుండో చిన్న సినిమాలను ప్రోత్సహిస్తూ వస్తున్నారు.

కానీ బాలయ్య అలా ఎప్పుడూ చేయలేదు. ఏదో ఒకటీ అరా సినిమాలకు తప్పితే.. బాలయ్య ఇలా ఇతర హీరోల వేడుకలకు వెళ్లింది లేదు. అందుకే ఇప్పుడంతా కొత్తగా చూస్తున్నారు. ఇండస్ట్రీని బాలయ్య తన చేతుల్లోకి తీసుకోవాలని చూస్తున్నారా? అసలు అల్లు ఫ్యామిలీ స్కెచ్ ఏంటి? చిరంజీవిని ఎందుకు దూరం పెడుతుంది? బాలయ్యను ఎందుకు ఎంకరేజ్ చేస్తుంది? వంటి విషయాలకు కాలమే సమాధానం చెప్పాలి. ఇక అల్లు శిరీష్ ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమా అప్పుడెప్పుడో మొదలైంది.

మరోసారి డేరా బాబాకు బెయిల్.. 40 రోజుల పెరోల్‌పై విడుదల

ముందు ఈ సినిమాకి ‘ప్రేమ కాదంట’ అనే టైటిల్‌ని పెట్టారు. రీసెంట్‌గా టైటిల్ మార్చారు. ఈ సినిమాలో అల్లు శిరీష్ పక్కన అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటించింది. వీరిద్దరి కెమిస్ట్రీ ఏ రేంజ్‌లో ఉందో ఇటీవల వచ్చిన టీజర్ చూస్తుంటే తెలిసిపోతుంది.

రాకేష్ శశి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై ధీరజ్ మొగిలినేని నిర్మించగా.. అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. నవంబర్ 4న గ్రాండ్‌గా ఈ చిత్రం విడుదల కాబోతోంది.

Latest News