Balka Suman 4 కోట్లతో బస్సు డిపో నిర్మాణానికి భూమి పూజ సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే చెన్నూరు అభివృద్ధి విధాత ప్రతినిధి, ఉమ్మడి అదిలాబాద్: చెన్నూరు ప్రాంత అభివృద్ధిని గతంలో గెలిచిన పార్టీల నాయకులు విస్మరించారని, సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే చెన్నూరు నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని బీఆరెస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో 4 కోట్ల రూపాయలతో నూతనంగా […]
Balka Suman
విధాత ప్రతినిధి, ఉమ్మడి అదిలాబాద్: చెన్నూరు ప్రాంత అభివృద్ధిని గతంలో గెలిచిన పార్టీల నాయకులు విస్మరించారని, సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే చెన్నూరు నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని బీఆరెస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు.
మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో 4 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించే చెన్నూరు బస్ డిపో పనులకు బాల్క సుమన్ భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాల హాయంలో ఎన్ని ఆందోళనలు చేసిన ఎవరూ పట్టించుకోలేదని, చెన్నూరు బస్ డిపో ఈ ప్రాంత ప్రజల దశాబ్దల కల అని, అది నేడు సాకారం అవుతుందన్నారు. డిపో ఏర్పాటుతో చెన్నూరు కేంద్రంగా రవాణా సౌకర్యం పెరుగుతుందన్నారు.
సీఎం కేసీఆర్ అడిగిన వెంటనే నియోజకవర్గ ప్రజల కోసం బస్ డిపో మంజూరు చేశారని, ఇందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలన్నారు. నేషనల్ హైవే కి అనుకొని నాలుగు ఎకరాల్లో నాలుగు కోట్ల రూపాయలతో బస్ డిపో నిర్మాణం రెండు నెలల్లో పూర్తిచేసేలా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. వర్షాకాలం ముగిసిన వెంటనే 1658 కోట్లతో సుమారు లక్ష ఎకరాలకు నీరు అందించే చెన్నూర్ ఎత్తిపోతల పథకం పనులు, ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పనులు ప్రారంభిస్తామన్నారు.