విధాత: ఖమ్మం జిల్లా నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవం సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సందర్భంగానే కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమాన్ని కూడా ఢిల్లీ, పంజాబ్, కేరళ, తెలంగాణ సీఎంలు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, పినరయి విజయన్ చేతుల మీదుగా ప్రారంభించారు. అయితే కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం అనంతరం మంత్రులను, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలను ఆయా రాష్ట్రాల సీఎంలకు కేసీఆర్ పరిచయం చేశారు. ఈ నేపథ్యంలో మధిర కాంగ్రెస్ […]
విధాత: ఖమ్మం జిల్లా నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవం సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సందర్భంగానే కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమాన్ని కూడా ఢిల్లీ, పంజాబ్, కేరళ, తెలంగాణ సీఎంలు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, పినరయి విజయన్ చేతుల మీదుగా ప్రారంభించారు.
అయితే కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం అనంతరం మంత్రులను, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలను ఆయా రాష్ట్రాల సీఎంలకు కేసీఆర్ పరిచయం చేశారు. ఈ నేపథ్యంలో మధిర కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్కను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు కేసీఆర్ ప్రత్యేకంగా పరిచయం చేశారు.
భట్టి విక్రమార్కను ప్రత్యేకంగా పరిచయం చేసిన CM KCR https://t.co/bNBCi9waPV #CMKCR #KCR #BRS #TRS #Telangana #Congress pic.twitter.com/NUtkESVZEf
— vidhaathanews (@vidhaathanews) January 18, 2023
ఈ సందర్భంగా విక్రమార్కను కేసీఆర్ ఆలింగనం చేసుకున్నారు. విక్రమార్కను పరిచయం చేసే క్రమంలో కేసీఆర్ హుషారుగా కనిపించారు. ఇక సందర్భం వచ్చినప్పుడల్లా కేసీఆర్ విక్రమార్క పట్ల కొంత సానుకూలత ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ సమావేశాల్లోనూ విక్రమార్కపై కేసీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు.
సీనియర్ నాయకులు అంటూ ఆయనను ఆకాశానికి ఎత్తుతుంటారు అధికార పార్టీ నాయకులు. అంతే కాదు.. ఆ మధ్యలో అధికార పార్టీలో భట్టి చేరుతారని వార్తలు గుప్పుమన్నాయి. మొత్తానికి కేసీఆర్ భట్టి విక్రమార్కను ప్రత్యేకంగా పరిచయం చేయడం, ఆలింగనం చేసుకోవడం ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది.