13న మేధావులతో రౌండ్టేబుల్ సమావేశం 14న అంబేడ్కర్ విగ్రహాలకు మెమొరాండం 15న నిరుద్యోగ మార్చ్ హాజరుకానున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఈనెల 15న హనుమకొండ(Hanamkonda)లో నిర్వహించనున్న నిరుద్యోగ మార్చ్కు బీజేపీ ముందస్తు సన్నాహాలు చేస్తోంది. దీనిలో భాగంగా ఈనెల 13న హోటల్ హరిత కాకతీయలో మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తారు. 14న అంబేద్కర్ రాజ్యాంగం కాపాడుకుందాం, మా ఉద్యోగాలు మాకు కావాలని అంబేద్కర్ విగ్రహానికి మెమోరాండం సమర్పిస్తారు. […]
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఈనెల 15న హనుమకొండ(Hanamkonda)లో నిర్వహించనున్న నిరుద్యోగ మార్చ్కు బీజేపీ ముందస్తు సన్నాహాలు చేస్తోంది. దీనిలో భాగంగా ఈనెల 13న హోటల్ హరిత కాకతీయలో మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తారు.
14న అంబేద్కర్ రాజ్యాంగం కాపాడుకుందాం, మా ఉద్యోగాలు మాకు కావాలని అంబేద్కర్ విగ్రహానికి మెమోరాండం సమర్పిస్తారు. 15న కేయు SDLCE నుండి హనుమకొండ అంబేద్కర్ విగ్రహం వరకు నిరుద్యోగ మార్చ్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ తో పాటు ముఖ్య నాయకులందరూ పాల్గొంటారు.
నిరుద్యోగ మార్చ్ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంఛార్జిగా బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపి డా. జీ. వివేక్ వెంకటస్వామిని నియమించారు. ఓరుగల్లు నిరుద్యోగ మార్చ్ సందర్భంగా ఈరోజు హనుమకొండలో బిజెపి నాయకులు మంగళవారం మీడియాతో మాట్లాడారు.
యువతకు మొండిచెయ్యి
రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం చేసిన యువకులకు బిఅరెస్ ప్రభుత్వం మొండి చేయి చూపిందని బిజెపి రాష్ట్ర ప్రధాన ప్రేమేందర్ రెడ్డి విమర్శించారు. ఆయన కామెంట్స్ ఇలా ఉన్నాయి. రాష్ట్రంలో ఏ పరీక్ష జరిగిన లీకేజీలే..గతంలో కూడా లీకేజీ చేసి అమ్ముకున్నట్టు వార్తలు వచ్చాయి.
లీకేజీకి కారణమైన బోర్డును రద్దు చేయకుండా మళ్ళీ వాళ్ళ హయాంలోనే పరీక్ష పెడతారట. సిట్ విచారణ పూర్తి కాకముందే ఇది ఇద్దరి వ్యక్తుల మధ్య తప్పిదం అని కేటీఆర్ ఎలా అంటారు. TSPSC అంశాన్ని మర్చిపోవడానికి కొత్త కొత్త అంశాలు తెరమీదికి తెస్తున్నారు. మంత్రి కేటీఆర్ ను భర్తరఫ్ చేసి పరీక్ష రాసిన విద్యార్థులకు లక్ష రూపాయల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
లీకేజీ తెలంగాణను నివ్వెరపరిచింది
TSPSC పేపర్ లీకేజీ తెలంగాణ సమాజాన్ని నివ్వెర పరిచిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ మంత్రి డా. విజయ రామారావుఅన్నారు. ఆయన కామెంట్స్ ఇలా ఉన్నాయి.TSPSC సంస్థ నిర్మాణం లోనే లోపం ఉంది. వారి అనుభవాలను పరిగణనలోకి తీసుకోలేదు.
అందుకే ఇలాంటి గందరగోళం జరిగింది. రాజకీయ అవసరాల కోసం TSPSC వ్యవస్ట ను వాడుకున్నారు.. డబ్బులకు సీట్లు అమ్ముకునే వారిని మెంబర్లు గా నియమించారు. ప్రజా సమస్యల పై స్పందించే ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని కోరారు.
ఈ సమావేశంలో హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ,జిల్లా ప్రధాన కార్యదర్శులు దేశినీ సదానందం గౌడ్, కొండి జితేందర్ రెడ్డి, రిటైర్డ్ టీచర్స్ అండ్ ఎంప్లాయీస్ సెల్ రాష్ట్ర నాయకులు ప్రభాకర్, మహిళ మోర్చ జిల్లా అధ్యక్షురాలు కేతిరెడ్డి విజయలక్ష్మి, కిసాన్ మోర్చ జిల్లా అధ్యక్షులు పుల్యాల రవీందర్ రెడ్డి, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ కందగట్ల సత్యనారయణ,జిల్లా కార్యాలయ కార్యదర్శి చల్లా జైపాల్ రెడ్డి, ఓబిసి మోర్చ జిల్లా ఉపాధ్యక్షులు నర్మెట్ట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.