TCS CEO | టీసీఎస్‌ కొత్త సీఈవోగా కే కృతివాసన్‌.. ఆయన వేతనం ఎంతో తెలిస్తే షాక్‌ అవుతారు..!

TCS CEO | టాటా కన్సల్టెన్సీ సర్వీస్‌ (TCS) సీఈవో, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఎన్నికైన కే కృతివాసన్‌ 2024 ఆర్థిక సంవత్సరానికి రూ.26కోట్లకుపైగా వేతనం అందుకున్నట్లుగా కంపెనీ ప్రకటించింది. ఆయన వేతనం రూ.1.27కోట్ల వేతనం పొందారని చెప్పింది. అలాగే, రూ.3.08కోట్ల ప్రయోజనాలు, పారితోషికాలు, అలవెన్సులతో పాటు కమిషన్‌గా రూ.21క్టోలు పొందినట్లుగా టీసీఎస్‌ వార్షిక నివేదికలో పేర్కొంది.

TCS CEO | టీసీఎస్‌ కొత్త సీఈవోగా కే కృతివాసన్‌.. ఆయన వేతనం ఎంతో తెలిస్తే షాక్‌ అవుతారు..!

TCS CEO | టాటా కన్సల్టెన్సీ సర్వీస్‌ (TCS) సీఈవో, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఎన్నికైన కే కృతివాసన్‌ 2024 ఆర్థిక సంవత్సరానికి రూ.26కోట్లకుపైగా వేతనం అందుకున్నట్లుగా కంపెనీ ప్రకటించింది. ఆయన వేతనం రూ.1.27కోట్ల వేతనం పొందారని చెప్పింది. అలాగే, రూ.3.08కోట్ల ప్రయోజనాలు, పారితోషికాలు, అలవెన్సులతో పాటు కమిషన్‌గా రూ.21క్టోలు పొందినట్లుగా టీసీఎస్‌ వార్షిక నివేదికలో పేర్కొంది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ సహా వేర్వేరు సర్వీసులు అందిస్తున్న టీసీఎస్‌కు గ్లోబల్ హెడ్‌గా ఆయన ఈ భారీ మొత్తాన్ని అందుకున్నారని వివరించింది.

రాజేశ్‌ గోపీనాథన్‌ స్థానంలో కృతి వాసన్‌ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ పదవిలో ఆయన ఐదేళ్లపాటు కొనసాగనున్నారు. ఇక టీసీఎస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO) ఎన్‌జీ సుబ్రమణ్యం ఆర్థిక సంవత్సరం 2023-24లో ఏకంగా రూ.26.18 కోట్లు వేతనంగా అందుకున్నారని కంపెనీ వార్షిక నివేదికలో వెల్లడించింది. త్వరలోనే ఆయన పదవీ విరమణ చేయనున్నారు. వేతనంగా రూ.1.72కోట్లు.. ప్రయోజనాలు, పారితోషికాలు, అలవెన్సుల రూపంలో మరో రూ.3.45 కోట్లు, కమీషన్‌గా రూ.21 కోట్లు ఆర్జించినట్లుగా చెప్పింది. సీవోవో వార్షిక వేతనం 8.2శాతం పెరిగిందని.. హోదాలో మార్పుల కారణంగా కృతివాసన్ జీతాన్ని సుబ్రమణ్యం వేతనంతో పోల్చలేమని టీసీఎస్‌ వివరించింది.

ఇదిలా ఉండగా మార్చి 31, 2024 నాటికి కంపెనీలోని మధ్యస్థ వేతనంగా ఉన్న రూ.6,01,546 తో పోల్చితే సీవోవో వేతనం 346.2 రెట్లు అధికమని టీసీఎస్ తెలిపింది. కంపెనీలో సగటు వార్షిక పెరుగుదల 5.5-8 శాతం శ్రేణిలో ఉంటుందని, అత్యుత్తమంగా రాణించే ఉద్యోగులకు రెండంకెల ఇంక్రిమెంట్లు అందిస్తున్నామని ప్రకటించింది. ఆర్థిక సంవత్సరం 2023-24 చివరి నాటికి కంపెనీ ఉద్యోగుల్లో 35.6 శాతం మహిళలు ఉన్నారని కంపెనీ చెప్పింది. కంపెనీ ఉద్యోగుల్లో దాదాపు 55శాతం మంది వారంలోని అన్ని పని దినాలు ఆఫీసు నుంచి వర్క్ చేస్తున్నారని వెల్లడించింది.

సీఈఓగా రెండు నెలలపాటు సేవలు అందించిన గోపీనాథన్ వేతనంగా రూ.33.6 లక్షలు, ప్రయోజనాలు, పారితోషికాల రూపంలో రూ.76.8 లక్షలు అందుకున్నారని వివరించింది. అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితుల కారణంగా మార్కెట్‌లో ఒకింత అనిశ్చితి నెలకొందని.. వృద్ధిపై ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొంది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2024 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం 17.6 శాతం నుంచి 6.8 శాతానికి తగ్గిందని వివరించింది. ఇక ఆల్-టైమ్ హై ఆర్డర్ బుక్, నిరంతరం కొనసాగుతున్న ఒప్పందాలు, ప్రణాళికలు కంపెనీ వృద్ధి వేగాన్ని పెంచుతాయని వార్షిక నివేదికలో సీఈవో కృతివాసన్ విశ్వాసం వ్యక్తం చేశారు.