BRS | విధాత: బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేల టికెట్లు ఖరారు వ్యవహారంపై అసంతృప్తి తో రగిలిపోతున్న ఆశావాహులు, అసమ్మతివాదులు రాజీ రాయబేరాలను తిరస్కరించడంలోనూ నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నా రు. స్టేషన్ ఘనపూర్ సిటింగ్ ఎమ్మెల్యే రాజయ్య తనను కాదని కడియం శ్రీహరికి టికెట్ ఇవ్వడంతో బోరు మన్నారు. ఆయనను బుజ్జగించేందుకు సీఎం కేసీఆర్ పంపిన దూత పల్లా రాజేశ్వర్ రెడ్డి నిన్న రాజయ్య ఇంటికి వెళ్లారు. అయితే తాను అందుబాటులో లేనట్టు సమాచారం ఇచ్చిన రాజయ్య ఇంటికి […]
BRS |
విధాత: బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేల టికెట్లు ఖరారు వ్యవహారంపై అసంతృప్తి తో రగిలిపోతున్న ఆశావాహులు, అసమ్మతివాదులు రాజీ రాయబేరాలను తిరస్కరించడంలోనూ నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నా రు. స్టేషన్ ఘనపూర్ సిటింగ్ ఎమ్మెల్యే రాజయ్య తనను కాదని కడియం శ్రీహరికి టికెట్ ఇవ్వడంతో బోరు మన్నారు.
ఆయనను బుజ్జగించేందుకు సీఎం కేసీఆర్ పంపిన దూత పల్లా రాజేశ్వర్ రెడ్డి నిన్న రాజయ్య ఇంటికి వెళ్లారు. అయితే తాను అందుబాటులో లేనట్టు సమాచారం ఇచ్చిన రాజయ్య ఇంటికి వచ్చిన పల్లాకు ముఖం చాటేశారు. ఈరోజు గురువారం కోదాడ సిటింగ్ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు ను మచ్చిక చేసుకునేందుకు చేసిన ప్రయత్నం కూడా బెడిసి కొట్టింది.
చందర్ రావును బుజ్జగించేందుకు ఆయన ఇంటికి వెళ్లిన బొల్లంకు తాను ఇంట్లో ఉండి కూడా లేనంటూ సమాధానం చెప్పించారు. కొంతసేపు నిరీక్షించినప్పటికీ చందర్ రావు ఆయనను కలవడానికి ఇష్టపడక పోవడంతో బొల్లం నిరాశగా వెనుదిరిగారు.
పలు నియోజకవర్గాలలోని ఆశావహులు, అసంతృప్తివాదులు సైతం ఇదే రీతిలో బుజ్జగింపులకు, రాయ బేరాలకు అందుబాటులో ఉండకుండా తప్పించుకుంటున్నారు. దీంతో వారిని బుజ్జగించి తమ దారికి తెచ్చుకోవడం బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం పెద్దలకు, సిట్టింగ్ లకు సవాల్ గా తయారైంది.