విధాత, హైదరాబాద్ : తెలంగాణలో హోలి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. యువతీ, యువకులు, చిన్నా, పెద్దా రంగులు చల్లుకుని సంబరాలు చేసుకున్నారు. గుంపులుగా హోలి వేడుకలలో రాజకీయ ప్రముఖులు సైతం ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని తన నివాసంలో మనవడు రేయాన్స్తో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. భార్య గీతారెడ్డితో కలిసి మనవడిపై రంగులు చల్లుతూ ఉత్సాహంగా కనిపించారు. తాత ఒళ్లో కూర్చుని రేయాన్స్ చిరునవ్వులు చిందించిన ఫోటోలు వైరల్గా మారాయి.