1800 కోట్ల బకాయిలు విడుదల చేయండి
తెలంగాణకు రావాల్సిన వెనుకబడిన ప్రాంతాల గ్రాంటు విడుదలకు సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నీతి ఆయోగ్ను కోరారు.

- నీతి అయోగ్ వైస్ చైర్మన్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
- మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి సహకరించండి
న్యూఢిల్లీ : తెలంగాణకు రావాల్సిన వెనుకబడిన ప్రాంతాల గ్రాంటు విడుదలకు సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నీతి ఆయోగ్ను కోరారు. తెలంగాణకు రావల్సిన 18 వందల కోట్లు వెంటనే విడుదల చేయాలన్నారు. మంగళవారం ఢిల్లీలో నీతి ఆయోగ్ వైఎస్ చైర్మన్ సుమన్ భేరీతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సమావేశమయ్యారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు రావల్సిన గ్రాంటు రూ.1800 కోట్లు వెంటనే విడుదలయ్యేలా సహకరించాలని @NITIAayog వైస్ ఛైర్మన్ శ్రీ సుమన్ భేరీకి ముఖ్యమంత్రి శ్రీ @Revanth_Anumula విజ్ఞప్తి చేశారు. న్యూఢిల్లీలో నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ను ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి… pic.twitter.com/UgchwyXfee
— Telangana CMO (@TelanganaCMO) February 5, 2024
ఈ సందర్భంగా హైదరాబాద్లో మూసీ నది రివర్ ఫ్రంట్ అభివృద్ధికి అవసరమైన నిధులు ఇప్పించాలని కోరారు. అందుకు అవసరమైన ప్రపంచబ్యాంకు ఎయిడ్ విడుదలకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తాగునీటి సరఫరాకు అవసరమైన నిధులతోపాటు విద్య, వైద్యం, ఆరోగ్య రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోయే సంస్కరణలకు మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ కూడా ఉన్నారు.