సీఎం బహిరంగ సభను విజయవంతం చేయాలి బీసీ కుల వృత్తుల వారికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం ప్రభుత్వ విప్ బాల్క సుమన్ విధాత ప్రతినిధి ఉమ్మడి అదిలాబాద్: జూన్ 9వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిచే ప్రారంభించనున్న మంచిర్యాల జిల్లా ఐడీఓసీ సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రభుత్వ విప్ & చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ (Balka Suman), మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు సందర్శించారు . ఈ సందర్భంగా బాల్క సుమన్, దివాకర్ రావు […]
విధాత ప్రతినిధి ఉమ్మడి అదిలాబాద్: జూన్ 9వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిచే ప్రారంభించనున్న మంచిర్యాల జిల్లా ఐడీఓసీ సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రభుత్వ విప్ & చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ (Balka Suman), మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు సందర్శించారు . ఈ సందర్భంగా బాల్క సుమన్, దివాకర్ రావు మాట్లాడుతూ … కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ జూన్ 9న మంచిర్యాల జిల్లా పర్యటనలో భాగంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారని తెలిపారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాలతో పాటు సమీప ప్రాంతంలోని అన్ని నియోజకవర్గాల ప్రజలు పెద్ద మొత్తంలో సీఎం బహిరంగ సభకు హాజరుకావాలని కోరారు. సాయంత్రం జరిగే బహిరంగ సభలో లక్ష మందికి పైగా ప్రజలు హాజరవుతారని పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ నూతన భవనాన్ని అలాగే పక్కనే నిర్మించిన టిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని సీఎం ప్రారంభిస్తారని పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నుండి 1658 కోట్లతో చెన్నూరు నియోజకవర్గంలోని దాదాపు లక్ష ఎకరాలకు సాగునీరు అందించే చెన్నూరు ఎత్తిపోతల పథకం పనులకు శంకుస్థాపన. చేస్తారని తెలిపారు. మంచిర్యాల వేదికగా కొన్ని కొత్త పథకాలను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని తెలిపారు.
అందులో భాగంగా క్యాబినెట్ నిర్ణయం మేరకు బీసీ కులవృత్తులు చేసే వారికి లక్ష రూపాయల ఆర్థిక సాయం చేసే పథకాన్ని ఇక్కడినుండే ప్రారంభిస్తారని ఆయన పేర్కొన్నారు అలాగే మూడో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తారని తెలిపారు.
మంచిర్యాల – అంతర్గాం మధ్య గోదావరి నదిపై 164 కోట్లతో నిర్మించే బ్రిడ్జి పనులకు భూమి పూజ చేస్తారని తెలిపారు. సింగరేణి ఏరియాలోని శ్రీరాంపూర్ రామకృష్ణాపూర్ తదితర ప్రాంతాల్లో ఇండ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు పట్టాల పంపిణీ చేస్తారని తెలిపారు. ఈ సమావేశంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గ్రంధాలయ చైర్మన్ రేణుక ప్రవీణ్ మున్సిపల్ చైర్మన్లు జిల్లా అధికారులు పాల్గొన్నారు.