దిల్ రాజు VS సి.కళ్యాణ్‌: మళ్లో కొత్త పంచాయితీ షురూ!

విధాత‌: తెలుగు నిర్మాతల మండలి ఎన్నికలు వారం క్రితం జరిగాయి. అందులో సీనియర్ నిర్మాతలు సి.కళ్యాణ్, దిల్ రాజు వేరువేరు ప్యానల్స్ ఏర్పాటు చేసుకొని బరిలోకి దిగారు. అధ్యక్షుడిగా దిల్ రాజు ప్యానెల్ నుంచి కే.ఎల్ దామోదర్ ప్రసాద్ గెలవగా.. గౌరవ కార్యదర్శులుగా సి.కళ్యాణ్ ప్యానెల్ నుంచి తుమ్మల ప్రసన్నకుమార్, వైవిఎస్ చౌదరి గెలిచారు. సంయుక్త కార్యదర్శి మెంబర్స్‌లో దిల్ రాజు ప్యానల్‌దే పైచేయి అయింది. ఆ ప్యానల్ నుంచి పది మంది గెలవగా సి.కళ్యాణ్ ప్యానెల్ […]

  • Publish Date - February 26, 2023 / 05:33 PM IST

విధాత‌: తెలుగు నిర్మాతల మండలి ఎన్నికలు వారం క్రితం జరిగాయి. అందులో సీనియర్ నిర్మాతలు సి.కళ్యాణ్, దిల్ రాజు వేరువేరు ప్యానల్స్ ఏర్పాటు చేసుకొని బరిలోకి దిగారు. అధ్యక్షుడిగా దిల్ రాజు ప్యానెల్ నుంచి కే.ఎల్ దామోదర్ ప్రసాద్ గెలవగా.. గౌరవ కార్యదర్శులుగా సి.కళ్యాణ్ ప్యానెల్ నుంచి తుమ్మల ప్రసన్నకుమార్, వైవిఎస్ చౌదరి గెలిచారు.

సంయుక్త కార్యదర్శి మెంబర్స్‌లో దిల్ రాజు ప్యానల్‌దే పైచేయి అయింది. ఆ ప్యానల్ నుంచి పది మంది గెలవగా సి.కళ్యాణ్ ప్యానెల్ నుంచి 5 మంది మాత్రమే విజయం సాధించారు. ఈ ఎన్నికలకు జరిగిన ప్రచారం, ఎన్నికలలో వచ్చిన రిజల్ట్‌తో.. సి.కళ్యాణ్ ఒకింత ఆగ్రహంతో ఉన్నారనేది తాజా పరిణామాలను చూస్తుంటే తెలుస్తుంది.

అదెలా అంటే.. దిల్ రాజు కుమార్తె అన్షిత, ఆయన అన్న కొడుకు హర్షిత్ రెడ్డి కలిసి సినిమాలను నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. వీరు నిర్మించిన ఏటీఎం అనే వెబ్ సిరీస్ ఇటీవల ఓటిటి‌లో స్ట్రీమింగ్ అయింది. వీరిద్దరూ కలిసి కమెడియన్ వేణును దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘బలగం’ పేరుతో ఓ సినిమా నిర్మించారు.

దీని ప్రీమియర్ షోస్‌ని ఇప్పటికే కొన్నిచోట్ల ప్రదర్శించారు. మంచి పాజిటివ్ టాక్ వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘బలగం’ మూవీని మార్చి 3న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.

మరో వైపు ఈ సినిమాకు పోటీగా సి.కళ్యాణ్ తన జీవిత భాగస్వామి కోనేరు కల్పన నిర్మించిన ‘ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు’ చిత్రాన్ని విడుదల చేస్తుండటంతో.. దిల్ రాజుపై సి.కళ్యాణ్ చాలా ఆగ్రహంగా ఉన్నారనేలా టాక్ మొదలైంది.

దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత మరోసారి మెగా ఫోన్ చేతబట్టి చేసిన సినిమా ‘ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు’. రాజేంద్రప్రసాద్, మీనా ముఖ్య పాత్రలు పోషించారు. అచ్చిరెడ్డి సమర్పణలో కల్పన నిర్మించారు.

ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని కొద్దిరోజులుగా మంచి రిలీజ్ డేట్ కోసం ఎదురు చూస్తోంది. కోరి కోరి మార్చి 3వ తేదీనే ఈ సినిమాను ‘బలగం’పై పోటీగా విడుద‌ల చేయ‌డం చూస్తుంటే.. సి కళ్యాణ్, దిల్ రాజు మధ్య కోల్డ్ వార్ ఇంకా ముగియ‌లేద‌నిపిస్తోంది.

ఇక మూడో తారీఖున విడుదల చేసేందుకు పలు చిన్న చిత్రాలను కూడా నిర్మాతలు ప్రకటించారు. ఇవన్నీ కూడా అదే రోజున విడుదలవుతాయో లేక ఒకటి రెండు సినిమాలు వెనక్కి వెళతాయా అనేది చూడాలి. అందులో ‘బలగం’, ‘ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు’ సినిమాలు ఎటువంటి టాక్‌ని సొంతం చేసుకుంటాయనే దానితో పాటు.., దిల్ రాజా? సి. కళ్యాణా? అనేది కూడా తెలిసిపోతుంది.

Latest News