విధాత: దక్షిణాది రాష్ట్రాల దెబ్బకు కేంద్రంలోని మోదీ సర్కారు తోకముడిచింది. పెరుగు ప్యాకెట్లపై హిందీలో దహీ అని ముద్రించాలంటూ జారీ చేసిన ఉత్తర్వును ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఎఐ) ఉపసంహరించుకున్నది. పెరుగు ప్యాకెట్లపై స్థానిక భాష బదులు హిందీలో దహీ అని ముద్రించాలని కేంద్ర ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ కర్ణాటక, తమిళనాడు, కేరళ పాల ఉత్పత్తి దారుల సంఘాలను ఆదేశించింది. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. March 30, PRESS […]
విధాత: దక్షిణాది రాష్ట్రాల దెబ్బకు కేంద్రంలోని మోదీ సర్కారు తోకముడిచింది. పెరుగు ప్యాకెట్లపై హిందీలో దహీ అని ముద్రించాలంటూ జారీ చేసిన ఉత్తర్వును ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఎఐ) ఉపసంహరించుకున్నది. పెరుగు ప్యాకెట్లపై స్థానిక భాష బదులు హిందీలో దహీ అని ముద్రించాలని కేంద్ర ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ కర్ణాటక, తమిళనాడు, కేరళ పాల ఉత్పత్తి దారుల సంఘాలను ఆదేశించింది. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.
March 30, PRESS RELEASE@MoHFW_INDIA pic.twitter.com/iWjwUbzCt3
— FSSAI (@fssaiindia) March 30, 2023
కేంద్ర ఉత్తర్వును ధిక్కరిస్తామని, హిందీ రుద్దడానికి వ్యతిరేకంగా పోరాడతామని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ హెచ్చరించారు. కర్ణాటకలోనూ పలు కన్నడ భాషా సంఘాలు హిందీ పెత్తనాన్ని వ్యతిరేకించాయి. జనతాదళ్ నాయకుడు హెచ్ఐ కుమారస్వామి కూడా హిందీ రుద్దడాన్ని వ్యతిరేకించారు. దక్షిణాది రాష్ట్రాలలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో కేంద్రం దడుచుకున్నది. వెంటనే దహీ అని ముద్రించాలంటూ జారీ చేసిను. ఉత్తర్వును ఉపసంహరించుకున్నది.