Godavarikhani నిందితున్ని అరెస్టు చేయాలని తల్లిదండ్రుల డిమాండ్ గోదావరిఖనిలో ముగిసిన ఆకాంక్ష అంత్యక్రియలు విధాత బ్యూరో, కరీంనగర్: బెంగళూరులో మృతి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆకాంక్షది సహజ మరణం కాదని, హత్యేనని అక్కడి పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. సంఘటన స్థలం నుండి ఆకాంక్ష స్నేహితుడు అర్పిత్ సెల్ ఫోన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆకాంక్ష నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ సీసీ కెమెరాల్లో అర్పిత్ కు సంబంధించిన ఫుటేజ్ లభ్యమైనట్టు సమాచారం. రాజస్థాన్ కు చెందిన […]
Godavarikhani
విధాత బ్యూరో, కరీంనగర్: బెంగళూరులో మృతి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆకాంక్షది సహజ మరణం కాదని, హత్యేనని అక్కడి పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. సంఘటన స్థలం నుండి ఆకాంక్ష స్నేహితుడు అర్పిత్ సెల్ ఫోన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.
ఆకాంక్ష నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ సీసీ కెమెరాల్లో అర్పిత్ కు సంబంధించిన ఫుటేజ్ లభ్యమైనట్టు సమాచారం. రాజస్థాన్ కు చెందిన వ్యాపారి బిడియాసర్ జ్ఞానేశ్వర్ గత కొన్నేళ్లుగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మేదరి బస్తీలో నివాసం ఉంటున్నారు. ఆయనకు ముగ్గురు కూతుర్లు ఓ కుమారుడు. జ్ఞానేశ్వర్ పెద్ద కూతురు ఆకాంక్ష సోమవారం బెంగుళూరులో మృతి చెందిన విషయం తెలిసిందే.
అయితే తన కూతురిది ముమ్మాటికి హత్యేనని జ్ఞానేశ్వర్ అంటున్నారు. ఆకాంక్ష గతంలో హైదరాబాద్లో పనిచేస్తున్నప్పుడు బైజుాస్ కంపెనీలో మేనేజర్ గా పని చేస్తున్న అర్పిత్ తో పరిచయం ఏర్పడింది.
ఆ తర్వాత బెంగుళూరు వెళ్లిన ఆకాంక్ష కొడిహళి జీవన్ భీమా నగర్ లో స్నేహితురాలితో కలిసి ఉంటుంది. గతంలో ఉన్న స్నేహం కారణంగా అర్పిత్ వారాంతంలో బెంగుళూరు వెళ్లి వస్తున్నట్లు తెలుస్తోంది.
ఇద్దరి మధ్య తలెత్తిన మనస్పర్ధలు కారణంగా అర్పిత్ స్నేహితురాలు లేని సమయంలో ఆకాంక్ష గదికి వెళ్లి దిండును ముఖంపై ఉంచి శ్వాస ఆడకుండా చేసి హత్య చేసినట్లు మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమ కూతురు హత్య విషయంలో పోలీసులు ఆలస్యం చేయకుండా నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఇదిలా ఉండగా ఆకాంక్ష అంత్యక్రియలు బుధవారం కుటుంబ సభ్యుల సమక్షంలో గోదావరిఖనిలో ముగిశాయి.