Godavarikhani | తల్లికి.. చంద్రుడిపై స్థలం కొనుగోలు చేసి ఇచ్చిన తనయ! రిజిస్ట్రేషన్ పూర్తి

Godavarikhani |  చంద్రయాన్ 3 జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగిన రోజే రిజిస్ట్రేషన్ పూర్తి లూనార్ రిజిస్ట్రీ వెబ్ సైట్ ద్వారా స్థలం కొనుగోలు సాయి విజ్ఞత తల్లిపై చూపిన ప్రేమకు ఫిదా అయిన గోదావరిఖని విధాత బ్యూరో, కరీంనగర్: 'చందమామ రావె జాబిల్లి రావే'..అంటూ అద్దంలో చంద్రుణ్ని దగ్గరగా చూపిస్తూ పెంచిన తల్లికి.. ఆ కూతురు ఏకంగా చంద్ర మండలంలోనే స్థలం కొనిచ్చింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్ 3 అడుగుపెట్టిన రోజే సాయి విజ్ఞత […]

  • Publish Date - August 25, 2023 / 02:45 AM IST

Godavarikhani |

  • చంద్రయాన్ 3 జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగిన రోజే రిజిస్ట్రేషన్ పూర్తి
  • లూనార్ రిజిస్ట్రీ వెబ్ సైట్ ద్వారా స్థలం కొనుగోలు
  • సాయి విజ్ఞత తల్లిపై చూపిన ప్రేమకు ఫిదా అయిన గోదావరిఖని

విధాత బ్యూరో, కరీంనగర్: ‘చందమామ రావె జాబిల్లి రావే’..అంటూ అద్దంలో చంద్రుణ్ని దగ్గరగా చూపిస్తూ పెంచిన తల్లికి.. ఆ కూతురు ఏకంగా చంద్ర మండలంలోనే స్థలం కొనిచ్చింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్ 3 అడుగుపెట్టిన రోజే సాయి విజ్ఞత భూమి కొనుగోలు కోసం పెట్టుకున్న రిజిస్ట్రేషన్ పూర్తి కావడం విశేషం.

పెద్దపెల్లి జిల్లా గోదావరిఖని జీఎం కాలనీకి చెందిన సింగరేణి ఉద్యోగి సుద్దాల రామచంద్ర, వకుళాదేవీ దంపతులకు ఇద్దరు కుమార్తెలు కాగా.. పెద్ద కుమార్తె సాయి విజ్ఞత అమెరికాలోని ఐయోవాలో నివాసం ఉంటున్నారు. గవర్నర్ కిమ్ రెనాల్డ్స్ కు ప్రాజెక్ట్ మేనేజర్ గా, ఫైనాన్షియల్ అడ్వైజర్ గా పనిచేస్తున్న సాయి విజ్ఞత.. గత ఏడాది 2022లో లూనార్ రిజిస్ట్రేషన్ పద్ధతిలో చంద్ర మండలంపై స్థలం కోసం దరఖాస్తు చేసుకున్నారు.

ఈనెల ఆగస్ట్ 23వ తేదీన ఎకరం భూమిని సాయి విజ్ఞత తల్లి వకుళాదేవీ, ఆమె కూతురు ఆర్త సుద్దాల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేస్తున్నట్టు సమాచారమందింది. మొత్తంగా అమ్మ ప్రేమకు బహుమతిగా గోదావరిఖనికి చెందిన సాయి విజ్ఞత చంద్ర మండలంపై స్థలం కోసం చేసిన రిజిస్ట్రేషన్.. ఇప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్ అయింది.

మానవ ఆవాసంపై పరిశోధనలు

చంద్రుడిపై మానవ ఆవాసానికి సంబంధించి ఇప్పటికే ప్రపంచ దేశాలు పరిశోధనలు జరుపుతున్నాయి. తాజాగా ఇస్రో చంద్రయాన్ 3లో భాగంగా జాబిల్లి దక్షిణ ధ్రువంపై కాలు మోపింది. చంద్రుడిపై మనుషులు నివసించడానికి అవకాశాల కోసం నిరంతర అన్వేషణ జరుగుతున్న క్రమంలోనే, జాబిల్లిపై రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభమైంది.

జాబిల్లిపై స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవడం అనేకమంది ప్రతిష్టగా భావిస్తుండడంతో, నివాస యోగ్యాలతో పని లేకుండా అక్కడ భూమి విక్రయాలు జరిగిపోతున్నాయి. చంద్రుడిపై భూమి కొనుగోలు చేయాలంటే లూనార్ రిజిస్ట్రీ వెబ్సైట్ సందర్శించాలి.

భూమి కొనాలనుకున్న ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవాలి. ఆ తరువాతే కొనుగోలుకు సంబంధించిన డాక్యుమెంట్లు అందుకునే వీలుంది. చంద్రుడిపై ప్రస్తుతం ఎకరాకు 35 లక్షలకు పైగానే ధర పలుకుతుంది. ఇప్పటికే అక్కడ బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్, సుశాంత్ సింగ్ రాజపుత్ భూమి కొనుగోలు చేశారు.

Latest News