పసడి కొనుగోలుదారులకు బిగ్‌ రిలీఫ్‌..! నేడు మార్కెట్‌లో ధరలు ఇవే..!

పసిడి ధరలు కొనుగోలుదారులకు భారీ ఊరట కల్పించాయి. వరుసగా రెండురోజులు పెరుగుతూ వచ్చిన ధరలు ప్రస్తుతం నిలకడగా కొనసాగుతున్నాయి

  • Publish Date - January 22, 2024 / 04:59 AM IST

Gold Rates | పసిడి ధరలు కొనుగోలుదారులకు భారీ ఊరట కల్పించాయి. వరుసగా రెండురోజులు పెరుగుతూ వచ్చిన ధరలు ప్రస్తుతం నిలకడగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.57,800 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి తులానికి రూ.63,050 పలుకుతున్నది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.58,250 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.63,580 వద్ద స్థిరంగా కొనసాగుతున్నది.


ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.57,800 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.63,050 వద్ద ట్రేడవుతున్నది. ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.57,950 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.63,200 వద్ద స్థిరంగా ఉన్నది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.57,800 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.63,050 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి ధరలు స్వల్పంగా ఊరటనిచ్చాయి. బులియన్‌ మార్కెట్‌లో వెండి ధరలు పతనమయ్యాయి. మరో వైపు వెండి ధర సైతం నిలకడగా ఉన్నది.


ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలోకు రూ.77వేలు పలుకుతున్నది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈక్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్‌ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్‌ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.