Gold Rates | మగువలకు బంగారం ధరలు షాక్ ఇచ్చాయి. ఇటీవల స్వల్పంగా తగ్గుతూ, నిలకడగా కొనసాగుతూ వచ్చిన ధరలు శనివారం బులియన్ మార్కెట్లో పెరిగాయి. 22 క్యారెట్ల పసిడిపై రూ.100 పెరిగి తులానికి తులం రూ.57,800 పలుకుతున్నది. ఇక 24 క్యారెట్ల పసిడిపై సైతం రూ.100 పెరిగి రూ.63,050కి పెరిగింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.58,400 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.63,710కి ఎగిసింది.
ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.57,800 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.63,050కి పెరిగింది. ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.57,950 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.63,200 వద్ద ట్రేడవుతున్నది. హైదరాబాద్లో 22 క్యారెట్ల పసిడి రూ.57,800 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.63,050 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి ధర సైతం పెరిగింది. రూ.500 పెరిగి కిలోకు రూ.76,500కి పెరిగింది.
ప్రస్తుతం హైదరాబాద్ వెండి కిలోకు రూ.78వేలు ధర పలుకుతున్నది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.