Group-1 | గ్రూప్-1 ప్రిలిమినరీ ఫైన‌ల్ కీ విడుద‌ల‌.. త్వ‌ర‌లోనే ఫ‌లితాలు..!

Group-1 విధాత‌: టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమిన‌రీ కీని విడుద‌ల చేసింది. ఫైన‌ల్ కీని వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచిన‌ట్లు టీఎస్‌పీఎస్సీ అధికారులు వెల్ల‌డించారు. ఫైన‌ల్ కీ విడుద‌లైన నేప‌థ్యంలో త్వ‌ర‌లోనే ఫ‌లితాలు విడుద‌ల కానున్నాయి. గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫ‌లితాలు ప్ర‌క‌టించిన త‌ర్వాత 1:50 నిష్ప‌త్తిలో అభ్య‌ర్థుల‌ను మెయిన్స్ కు ఎంపిక చేయ‌నున్నారు. మొత్తంగా 25,150 మందిని మెయిన్స్‌కు ఎంపిక చేయ‌నుంది టీఎస్‌పీఎస్సీ. ఈ ఏడాది జూన్ 11వ తేదీన గ్రూప్-1 ప్రిలిమిన‌రీ ప‌రీక్ష‌ను నిర్వ‌హించిన విష‌యం విదిత‌మే. కాగా, […]

  • Publish Date - August 1, 2023 / 04:25 PM IST

Group-1

విధాత‌: టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమిన‌రీ కీని విడుద‌ల చేసింది. ఫైన‌ల్ కీని వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచిన‌ట్లు టీఎస్‌పీఎస్సీ అధికారులు వెల్ల‌డించారు. ఫైన‌ల్ కీ విడుద‌లైన నేప‌థ్యంలో త్వ‌ర‌లోనే ఫ‌లితాలు విడుద‌ల కానున్నాయి. గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫ‌లితాలు ప్ర‌క‌టించిన త‌ర్వాత 1:50 నిష్ప‌త్తిలో అభ్య‌ర్థుల‌ను మెయిన్స్ కు ఎంపిక చేయ‌నున్నారు. మొత్తంగా 25,150 మందిని మెయిన్స్‌కు ఎంపిక చేయ‌నుంది టీఎస్‌పీఎస్సీ.

ఈ ఏడాది జూన్ 11వ తేదీన గ్రూప్-1 ప్రిలిమిన‌రీ ప‌రీక్ష‌ను నిర్వ‌హించిన విష‌యం విదిత‌మే. కాగా, 503 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి గానూ జూన్‌ 11వ తేదీన పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లా కేంద్రాల్లోని 994 సెంటర్లలో ఈ పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్ష కోసం 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 2,32,457 మంది అభ్యర్థులు హాజరయ్యారు.

Latest News