Gutta Sukhender Reddy | 50 ఏళ్లు ఏం చేశారని.. మళ్లీ చాన్స్: గుత్తా
Gutta Sukhender Reddy కాంగ్రెస్పై గుత్తా సుఖేందర్ రెడ్డి ఫైర్ విధాత: 50ఏళ్ల పాటు దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ నేతలు తెలంగాణ అభివృద్ధికి ఏం చేశారని..? మళ్లీ ఒక్క చాన్స్ అని అడుగుతున్నారంటు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ప్రశ్నించారు. బుధవారం నల్లగొండలో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతు కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వడం ఆలస్యం చేయడం వల్ల వేలాది మంది యువకులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారన్నారు. అందుకే తెలంగాణ సమాజం కాంగ్రెస్ ని […]

Gutta Sukhender Reddy
- కాంగ్రెస్పై గుత్తా సుఖేందర్ రెడ్డి ఫైర్
విధాత: 50ఏళ్ల పాటు దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ నేతలు తెలంగాణ అభివృద్ధికి ఏం చేశారని..? మళ్లీ ఒక్క చాన్స్ అని అడుగుతున్నారంటు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ప్రశ్నించారు. బుధవారం నల్లగొండలో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతు కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వడం ఆలస్యం చేయడం వల్ల వేలాది మంది యువకులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారన్నారు. అందుకే తెలంగాణ సమాజం కాంగ్రెస్ ని నమ్మలేదన్నారు.
ఇక మీదట కూడా నమ్మరన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అసహనంతో మాట్లాడుతున్నాడని, నిర్లజ్జగా, అడ్డగోలుగా ఆరోపణలు చేయడం రేవంత్ కు పరిపాటిగా మారిందన్నారు. కేసీఆర్ పైన వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడం సరికాదన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న కేసీఆర్ పై ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడం సరికాదని, ప్రతిపక్షాల భాష ప్రజాస్వామ్యనికి ప్రమాదమన్నారు.
విజన్ ఉన్న నాయకుడు సీఎం కేసీఆర్ అని,. కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉందని, రానున్న ఎన్నికల్లో అధికారంలోకి రావాలన్న కాంగ్రెస్, బీజేపీ పార్టీలవి పగటి కలలుగానే మిగిలి పోతాయన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో నంబర్ వన్ స్థానంలో నిలిపిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు.
ఉద్యమ సమయంలో కన్న కలలు అన్ని సాకారం చేస్తున్నారన్నారు. మాకు అందరికి కేసీఆర్ స్ఫూర్తి అని, కేసీఆర్ ఇచ్చిన స్పూర్తితో నే ఉద్యమంలో పాల్గొన్నామన్నారు. శాసన సభ, శాసన మండలి సమావేశాలు నాలుగు రోజుల పాటు జరిగాయని, సభలో వివిధ బిల్లులను పాస్ చేయడం జరిగిందన్నారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం హర్షణీయమన్నారు. ఉభయ సభలో ఆమోదించి ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపామన్నారు. కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఆర్టీసీని ప్రభుత్వం లో కలిపారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని సీఎం కేసీఆర్ అమలు చేశారన్నారు.
కేంద్రం తెలంగాణకు ఒక్క మంచి పని కూడా చేయలేదన్నారు. తెలంగాణ అభివృద్ధిపై విషం చిమ్మారన్నారు. తెలంగాణలో ఓట్లడిగే హక్కు బీజేపీ పార్టీకి లేదన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ పై ప్రేమ లేదని, ఆయనదంతా కపట ప్రేమ మాత్రమేనన్నారు.