పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అలర్ట్ .. మావోయిస్టు కదలికలపై పటిష్టమైన నిఘా

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మహారాష్ట్ర, తెలంగాణ, చతీష్ ఘడ్ పోలీసులు మూడు రాష్ట్రాల సరిహద్దు జిల్లాల పోలీసు అధికారులతో గడ్చిరోలి ఎస్పీ

  • Publish Date - March 23, 2024 / 03:27 PM IST

విధాత ప్రతినిధి ఉమ్మడి ఆదిలాబాద్:  పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మహారాష్ట్ర, తెలంగాణ, చతీష్ ఘడ్ పోలీసులు మూడు రాష్ట్రాల సరిహద్దు జిల్లాల పోలీసు అధికారులతో గడ్చిరోలి ఎస్పీ క్యాంపు ఆఫీస్ లో . అంకిత్ గోయల్, IPS.,Dy, ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, గడ్చిరోలి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

 రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., (ఐజీ) అధ్యక్షత వహించారు . రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు దృష్ట్యా మావోయిస్టుల కదలికలు, సరిహాద్దు ప్రాంతాల్లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల గురించి, ముఖ్యంగా మావోయిస్టుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచి సంబంధిత సమాచారాన్ని పరస్పరం చేరవేర్చుకోవాలని నిర్ణయించారు.

 పరస్పర సమాచారంతో మావోయిస్టులను కట్టడి చేయడం సులభతరమవుతుందని ఎన్నికలను సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించవచ్చని సంబంధిత అధికారులతో చర్చించి పలు సూచనలు ఇవ్వడం జరిగింది. రామగుండం కమీషనరేట్ ఆఫీస్ లో ఉన్న హెలిపాడ్ నుండి హెలికాప్టర్ లో రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీనివాస్, ఆసిఫాబాద్ ఎస్పీ భూపాలపల్లి ఎస్పీ , మంచిర్యాల డీసీపీ గడ్చిరోలికి వెళ్లి సమావేశం కి హాజరయ్యారు.

     ఈ సందర్భంగా సమావేశం లో పలువురు పోలీసు అధికారులు మాట్లాడుతూ… మూడు రాష్ట్రాల సరిహద్దు జిల్లాల అధికారులు సమన్వయంతో పనిచేసి ఎన్నికలు సజావుగా సాగేలా కృషిచేయాలన్నారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ప్రవేశ మరియు నిష్క్రమణ మార్గాలలో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి పకడ్బందీగా తనిఖీలు, మూడు రాష్ట్రల పోలీసులు పరస్పరం సమాచార వ్యవస్థను సమన్వయం చేసుకొంటూ సాఫీగా ఎన్నికలు సాగేలా చూడాలని అన్నారు. తెలంగాణ తో పాటు ఇతర రాష్ట్రాల తో సరిహద్దులో వున్న సమస్యాత్మకమైన గ్రామల పై ప్రత్యేక దృష్టి సారించాలని, NBW వారెంట్స్ ల విషయం లో మూడు రాష్ట్రాల పోలీసులు ఒకరి ఒకరు సహకరించుకోవాలని ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని అలాగే సరిహద్దుల వద్ద భద్రతా చర్యలు పటిష్టంగా ఏర్పాటు చేయాలని సూచించారు. నేరాల కట్టడి, కేసుల విషయంలో ఒకరికొకరు సహకరించుకుందామని కోరారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తీసుకోవా ల్సిన చర్యలపై ఇరురాష్ట్రాల అధికారులు చర్చించారు. పార్లమెంట్ ఎన్నికలు సజావుగా పూర్తయ్యేలా తీసుకోవాల్సిన ఏర్పాట్లపై సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.

ఈ సమావేశంలోశ్రీ. M. శ్రీనివాస్, IPS, సీపీ రామగుండం,శ్రీ. అంకిత్ గోయల్, IPS.,Dy, ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, గడ్చిరోలి.శ్రీ. జగదీష్ ఎన్. మీనా, డి వై. ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (Ops), CRPF, గడ్చిరోలి, శ్రీ. నీలోత్పల్. IPS, SP, గడ్చిరోలి,శ్రీ. నిఖిల్ పింగళే, IPS,ఎస్పీ గోండియా, శ్రీ కిరణ్ ఖరే, IPS, ఎస్పీ భూపాలపల్లి శ్రీ. K. సురేష్ కుమార్, IPS, ఎస్పీ ఆసిఫాబాద్, శ్రీ అశోక్ కుమార్, IPS, డీసీపీ మంచిర్యాల పాల్గొన్నారు .